పాఠశాల విద్యార్థుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘యువిక’పై కీలక అప్డేట్. ఇస్రో యువిక 2025 రిజిస్ట్రేషన్ విండో మార్చ్ 23తో ముగియనుంది. విద్యార్థులు/ తల్లిదండ్రులు ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం అధికారిక వెబ్సైట్ (jigyasa.iirs.gov.in.) లోదరఖాస్తు చేసుకోవచ్చు.
యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ "యువ విజ్ఞాని కార్యక్రం" లేదా యువిక అనేది యువ విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం, అంతరిక్ష యాప్స్పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి ఇస్రో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ఆధారిత రీసెర్చ్/కెరీర్లో మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రామ్ దోహదపడుతుంది.
భారతదేశంలో 2025 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7న తొలి ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు మే 19లోగా లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్లో తెలియజేసిన తేదీలోగా సంబంధిత ఇస్రో కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమం మే 19న ప్రారంభమై మే 30న ముగుస్తుంది.
ఇస్రో యువిక 2025: దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. (ముందుగా రిజిస్టర్ బటన్పై క్లిక్ చేసి, ప్రక్రియను పూర్తి చేసి, ఆపై మీ ఖాతాలోకి లాగిన్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపండి).
ఈ ప్రోగ్రామ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
అభ్యర్థుల ఎంపిక కింది పారామీటర్ల ఆధారంగా జరుగుతుంది
8వ తరగతి పరీక్షలో సాధించిన మార్కులు- 50 శాతం వెయిటేజీ
ఆన్లైన్ క్విజ్లో పర్ఫార్మెన్స్: 10శాతం వెయిటేజ్
సైన్స్ ఫెయిర్ (గత 3 సంవత్సరాల్లో పాఠశాల/ జిల్లా/ రాష్ట్రం అంతకంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనడం) - 2/5/10 శాతం వెయిటేజీ
ఒలింపియాడ్ లేదా తత్సమాన స్థాయి ర్యాంక్ (గత 3 సంవత్సరాల్లో పాఠశాల/ జిల్లా/ రాష్ట్రంలో 1 నుంచి 3 ర్యాంకు, అంతకంటే ఎక్కువ స్థాయి): 2/4/5 శాతం వెయిటేజీ
క్రీడా పోటీల విజేతలు (గత 3 సంవత్సరాల్లో పాఠశాల/జిల్లా/రాష్ట్ర స్థాయిలో 1 నుంచి 3 ర్యాంకులు): 2/4/5 శాతం వెయిటేజీ
గత మూడేళ్లలో స్కౌట్ అండ్ గైడ్స్/ఎన్సీసీ/ఎన్ఎస్ఎస్ సభ్యులు: 5 శాతం వెయిటేజీ
పంచాయతీ ప్రాంతాల్లోని గ్రామ/గ్రామీణ పాఠశాలల్లో చదువు: 15 శాతం వెయిటేజీ.
ఏడు కేంద్రాల్లో ప్రతి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీస భాగస్వామ్యం ఉండేలా ఇస్రో చూసుకుంటుంది.
డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్).
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ), తిరువనంతపురం.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ).
యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ (యు.ఆర్.ఎస్.సి), బెంగళూరు.
స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ), అహ్మదాబాద్.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), హైదరాబాద్.
నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈ-ఎస్ఏసీ), షిల్లాంగ్.
ఎంపిక చేసిన విద్యార్థుల ప్రయాణ ఖర్చులు (సమీపంలోని రైల్వే స్టేషన్ లేదా బస్ టెర్మినల్ నుంచి సెకండ్ ఎసీ రైలు లేదా ఎసీ బస్సు ఛార్జీలు) రీయింబర్స్ చేస్తామని ఇస్రో తెలిపింది.
ప్రయాణ ఛార్జీల రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఒరిజినల్ ట్రావెల్ టికెట్లను చూపించాల్సి ఉంటుంది.
కోర్సు మెటీరియల్, వసతి, భోజన సదుపాయం తదితర అంశాలను ఇస్రో భరిస్తుంది.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.
సంబంధిత కథనం