ఇండియన్ నేవీలో 1110 పోస్టులకు రిక్రూట్‌మెంట్.. అప్లై చేసేందుకు డైరెక్ట్ లింక్!-indian navy recruitment 2025 incet apply for 1110 posts check direct link for application here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఇండియన్ నేవీలో 1110 పోస్టులకు రిక్రూట్‌మెంట్.. అప్లై చేసేందుకు డైరెక్ట్ లింక్!

ఇండియన్ నేవీలో 1110 పోస్టులకు రిక్రూట్‌మెంట్.. అప్లై చేసేందుకు డైరెక్ట్ లింక్!

Anand Sai HT Telugu

ఇండియన్ నేవీ గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2025 జూలై 5న ప్రారంభమైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1110 మంది అభ్యర్థులను నియమించనున్నారు.

ఇండియన్ నేవీలో ఉద్యోగాల

ఇండియన్ నేవీలో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్‌న్యూస్. ఇండియన్ నేవీలో గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్(INCET 2025) కోసం దరఖాస్తు ప్రక్రియ 2025 జూలై 5 నుండి మెుదలైంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 జూలై 2025గా నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in సందర్శించాల్సి ఉంటుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1110 మంది అభ్యర్థులను నియమిస్తారు.

అర్హతలు

ప్రతి పోస్టుకు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి క్వాలిఫికేషన్ వేరుగా ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్‌కు అర్హత, విద్యార్హతలను చూసుకోవాలి. కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 45 ఏళ్లు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి రూ .295 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఉచితం.

ఎలా అప్లై చేయాలి

1. ముందుగా అభ్యర్థి joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.

2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మీరే రిజిస్టర్ చేసుకోవాలి.

4. ఆ తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.

5. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ చెక్ చేసి, ఆ తర్వాత మీ ఫీజు సబ్మిట్ చేయండి.

6. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.