జేఈఈ టాపర్లకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్ విజిట్ ఛాన్స్.. మీతోపాటు పేరెంట్‌కి ఫ్లైట్ టికెట్ ఫ్రీ-iit madras offer free flight ticket to top 200 jee advanced toppers with parent for campus visit ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  జేఈఈ టాపర్లకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్ విజిట్ ఛాన్స్.. మీతోపాటు పేరెంట్‌కి ఫ్లైట్ టికెట్ ఫ్రీ

జేఈఈ టాపర్లకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్ విజిట్ ఛాన్స్.. మీతోపాటు పేరెంట్‌కి ఫ్లైట్ టికెట్ ఫ్రీ

Anand Sai HT Telugu

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాపర్లను ఆకర్షించడానికి ఐఐటీ మద్రాస్ టాప్ 200 టాపర్‌లను క్యాంపస్ విజిట్ కోసం ఆహ్వానించింది. దీనితో పాటు ఇన్‌స్టిట్యూట్ విమాన టిక్కెట్లను కూడా అందిస్తోంది.

ఐఐటీ మద్రాస్

ండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025లో 200 మంది టాపర్లకు ఈ సంస్థ ప్రత్యేక ఆహ్వానం అందిస్తోంది. దీని కోసం విమాన టిక్కెట్ల నుండి వసతి వరకు ప్రతిదీ ఉచితంగా ఇస్తుంది. విద్యార్థితో పాటు తల్లిదండ్రులలో ఒకరి ఛార్జీని కూడా సంస్థ చెల్లిస్తుంది.

దేశంలోని ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ వాతావరణాన్ని చూపించడమే దీని ఉద్దేశం. ఐఐటీలో అధ్యయనాలు ఎలా జరుగుతాయో, ఇక్కడ ఏ అవకాశాలు అందుబాటులో ఉన్నాయో టాపర్లు తెలుసుకోవచ్చు. ఏ ఐఐటీ, ఏ కోర్సును ఎంచుకోవాలనుకుంటున్నారో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకోవాలని సంస్థ కోరుకుంటోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితం జూన్ 2న వచ్చింది. ఇందులో రజిత్ గుప్తా భారతదేశంలోనే మొదటి ర్యాంకు సాధించారు.

ప్రతి సంవత్సరం జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ప్రకటించిన తర్వాత అనేక అగ్రశ్రేణి ఐఐటీలు పూర్వ విద్యార్థుల సమావేశాలు, మార్గదర్శకత్వం వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఈసారి ఐఐటీ మద్రాస్ ఒక అడుగు ముందుకు వేసి విద్యార్థి, వారి తల్లిదండ్రులలో ఒకరికి విమాన ఛార్జీలను చెల్లించాలి క్యాంపస్ విజిట్ చేయించాలని నిర్ణయించింది.

ఈ పర్యటనలో, విద్యార్థులను క్యాంపస్‌ను చూపించనున్నారు. వారు ప్రొఫెసర్లతో మాట్లాడగలరు, ప్రయోగశాలలు, హాస్టళ్లను చూడగలరు. ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులను కలుస్తారు.

'కేవలం విద్య పరంగానే కాకుండా సమాజం, పరిశోధన, మద్దతు పరంగా కూడా ఇక్కడ జీవితం నిజంగా ఎలా ఉంటుందో విద్యార్థులకు చూపించడానికి, అనుభవాన్ని సృష్టించాలని మేం కోరుకుంటున్నాం.' అని ఐఐటీ మద్రాస్ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. దీని అర్థం విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, అలాగే స్నేహం, ఆవిష్కరణ, సపోర్ట్ ఎలా ఉంటుందో వాతావరణాన్ని చూడవచ్చు.

ఐఐటీ టాపర్లు సంస్థ కొత్త పరిశోధన, ఆవిష్కరణ ప్రయోగశాలలు, వ్యవస్థాపక సెల్, ప్రపంచంతో భాగస్వామ్యాల గురించి తెలుసుకునే అవకాశం కూడా పొందుతారు. చాలా మంది టాప్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు ఐఐటీ మద్రాస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.