ICSE Class 10 exam : ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు- విద్యార్థులు ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలి..-icse class 10 exam 2025 from february 18 check exam day instructions here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Icse Class 10 Exam : ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు- విద్యార్థులు ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలి..

ICSE Class 10 exam : ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు- విద్యార్థులు ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలి..

Sharath Chitturi HT Telugu

ICSE Class 10 exam dates : ఫిబ్రవరి 18 నుంచి ఐసీఎస్​ఈ 10 వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షలో పాటించాల్సిన గైడ్​లైన్స్​ని సీఐఎస్సీఈ ఇప్పటికే ప్రకటించింది. వీటి గురించి విద్యార్థులు కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

18 నుంచి ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు..

ఫిబ్రవరి 18న ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) ఈ ఎగ్జామ్స్​ని మార్చ్​ 27 వరకు నిర్వహించనుంది. 10 వ తరగతి పరీక్షలు 2025 ఇంగ్లిష్ లాంగ్వేజ్ - ఇంగ్లీష్ పేపర్ 1తో ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష రెండు గంటల పాటు జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కౌన్సిల్ సూచించిన సూచనలను కచ్చితంగా పాటించాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు- ఇవి ఫాలో అవ్వాలి..

  1. పరీక్ష ప్రారంభానికి నిర్దేశించిన సమయానికి ముప్పై నిమిషాల ముందు అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష హాల్/గదిలో కూర్చోవాలి.
  2. పేపర్ ముగియడానికి ముందు అభ్యర్థులను ఎగ్జామినేషన్ హాల్/రూమ్ నుంచి బయటకు అనుమతించరు.
  3. అభ్యర్థికి మ్యాప్ లేదా మరేదైనా స్టేషనరీ కూడా ఇవ్వాల్సి ఉందని ప్రశ్నలు సూచిస్తే, వెంటనే పర్యవేక్షక ఎగ్జామినర్ దృష్టికి తీసుకురావాలి.
  4. ప్రశ్నపత్రం మొదటి పేజీలో ఇచ్చే సాధారణ ఆదేశాలను అభ్యర్థులు జాగ్రత్తగా చదవాలి.
  5. అభ్యర్థులు ప్రశ్నపత్రంలో పేర్కొన్న ప్రశ్నల సంఖ్యకు మాత్రమే సమాధానాలు రాయాలి.
  6. మెయిన్ ఆన్సర్ బుక్​లెట్ పైభాగంలో అభ్యర్థులు తమ యూనిక్ ఐడీ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్), ఇండెక్స్ నంబర్, సబ్జెక్టును స్పష్టంగా రాయాలి. ఈ సమాచారాన్ని.. ఉపయోగించిన ప్రతి అడిషనల్​ బుక్​లెట్ ఫ్రంట్ షీట్​పై, లూజ్ మ్యాప్​లు, గ్రాఫ్ పేపర్లు మొదలైన వాటిపై కూడా రాయాలి.
  7. ఆన్సర్ బుక్​లెట్​లోని అన్ని ఎంట్రీలు నలుపు/నీలం ఇంక్​తో మాత్రమే రాయాలి.
  8. మెయిన్ ఆన్సర్ బుక్​లెట్ టాప్ షీట్​పై అభ్యర్థులు తమ సంతకాన్ని ఇందుకోసం కేటాయించిన స్థలంలో ఉంచాల్సి ఉంటుంది. అవి టాప్ షీట్​పై ఎక్కడా రాయకూడదు.
  9. ప్రశ్నపత్రంలోని ప్రతి షీట్​కి ఇరువైపులా అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జవాబుల బుక్​లెట్​లో అభ్యర్థులు కుడిచేతి అంచులు, ఎడమ చేతి అంచులు రెండింటి వద్ద మార్జిన్ ఉంచాలి. కొత్త సమాధానాలను సపరేట్​ లైన్​లో ప్రారంభించాల్సి ఉంటుంది.
  10. అభ్యర్థులు ప్రతి సమాధానం ప్రారంభంలో ఎడమ చేతి మార్జిన్​లో ప్రశ్న సంఖ్యను స్పష్టంగా రాయాలి. వారు ప్రశ్నను కాపీ చేయకూడదు. ప్రశ్నపత్రంలో ఉపయోగించిన సంఖ్యా విధానాన్నే ఉపయోగించేలా జాగ్రత్త పడాలి.
  11. అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత ఒక లైన్ వదిలివేయాలి.
  12. నీట్ హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్​ని పరిగణనలోకి తీసుకుంటారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. వారు సమాధానాలు రాయడానికి నలుపు /నీలం సిరా ఉన్న పెన్నును ఉపయోగించవచ్చు. పెన్సిళ్లను డయాగ్రామ్స్​కి మాత్రమే ఉపయోగించవచ్చు. అభ్యర్థులు అవసరమైన సబ్జెక్టులకు మ్యాథమెటికల్, డ్రాయింగ్ పరికరాలు, కలర్ పెన్సిళ్లను తీసుకురావచ్చు. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి, డెస్క్ లేదా ఇతర రకాల లెక్కింపు యంత్రాలను ఉపయోగించడానికి అనుమతి ఉండదు.
  13. పేపర్ రాయడానికి టైంటేబుల్​లో సూచించిన సమయంతో పాటు, ప్రశ్నలు చదవడానికి 15 నిమిషాల సమయం ఇస్తారు.
  14. అభ్యర్థులు ప్రశ్నలను చాలా జాగ్రత్తగా చదవాలి. అడగని సమాచారాన్ని రాయడంలో సమయాన్ని వృథా చేయకూడదు. ఎందుకంటే దీనికి మార్కులు ఇవ్వరు.
  15. అభ్యర్థులు ఒకటి లేదా రెండు ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించకూడదు.
  16. అభ్యర్థులు ఇప్పటికే జారీ చేసిన ఆన్సర్ బుక్​లెట్/కంటిన్యూషన్ బుక్​లెట్​లోని అన్ని పేజీల్లో రాయడం పూర్తి చేసిన తర్వాతనే అభ్యర్థన మేరకు అడిషనల్​ బుక్​లెట్​లను జారీ చేస్తారు.
  17. అభ్యర్థులు మెయిన్ ఆన్సర్ బుక్​లెట్​కు ఉపయోగించిన/ఉపయోగించని అన్ని కంటిన్యూషన్ బుక్​లెట్​లను జతచేయాలి.
  18. అభ్యర్థులు రఫ్ వర్క్​ సహా అన్ని పనులను మిగిలిన సమాధానాల మాదిరిగానే ఒకే షీట్​పై చేయాలి.
  19. పరీక్ష రాయడానికి కేటాయించిన సమయం ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ సమాధాన పత్రాలను సీక్వెన్షియల్ ఆర్డర్, టాప్​లో మొదటి పేజీ మొదలైన వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఆన్సర్ బుక్​లెట్/ కంటిన్యూషన్ బుక్​లెట్/ గ్రాఫ్/ మ్యాప్​పై సరైన యూఐడీ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్), ఇండెక్స్ నంబర్, సబ్జెక్టు పేపర్ రాసి ఉండేలా చూసుకోవాలి. జవాబు పత్రాలను ఎడమవైపు టాప్ కార్నర్​లో బిగించి అందజేయాలి.

ఐసీఎస్​ఈ ఫలితాలను మే 2025 లో ప్రకటిస్తామని కౌన్సిల్ అధికారిక నోటిఫికేషన్​లో తెలిపింది.

ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం