ఫిబ్రవరి 18న ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) ఈ ఎగ్జామ్స్ని మార్చ్ 27 వరకు నిర్వహించనుంది. 10 వ తరగతి పరీక్షలు 2025 ఇంగ్లిష్ లాంగ్వేజ్ - ఇంగ్లీష్ పేపర్ 1తో ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష రెండు గంటల పాటు జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కౌన్సిల్ సూచించిన సూచనలను కచ్చితంగా పాటించాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐసీఎస్ఈ ఫలితాలను మే 2025 లో ప్రకటిస్తామని కౌన్సిల్ అధికారిక నోటిఫికేషన్లో తెలిపింది.
ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం