సీఏ ఇంటర్​, ఫైనల్​ పరీక్షలపై బిగ్​ అప్డేట్​- రివైజ్డ్​ షెడ్యూల్​ విడుదల-icai releases revised schedule for ca inter final exams 2025 new dates here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీఏ ఇంటర్​, ఫైనల్​ పరీక్షలపై బిగ్​ అప్డేట్​- రివైజ్డ్​ షెడ్యూల్​ విడుదల

సీఏ ఇంటర్​, ఫైనల్​ పరీక్షలపై బిగ్​ అప్డేట్​- రివైజ్డ్​ షెడ్యూల్​ విడుదల

Sharath Chitturi HT Telugu

సీఏ ఇంటర్, ఫైనల్ ఎగ్జామ్స్ 2025 రివైజ్డ్​ షెడ్యూల్​ని ఐసీఏఐ విడుదల చేసింది. అభ్యర్థులు కొత్త తేదీలు, అధికారిక నోటిఫికేషన్​ని ఈ కింద చూడవచ్చు.

సీఏ పరీక్షల రివైజ్డ్​ షెడ్యూల్​ని చెక్​ చేశారా? (Hindustan Times)

సీఏ ఇంటర్మీడియట్​, ఫైనల్​ పరీక్షలపై బిగ్​ అప్డేట్​! రివైజ్డ్​ షెడ్యూల్​ని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ చార్టర్డ్​ అకౌంటెంట్స్​ ఆఫ్​ ఇండియా (ఐసీఏఐ) తాజాగా ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీఏ ఇంటర్​, ఫైనల్​ పరీక్షల తేదీలు..

సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు 2025 మే 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. కానీ భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు.. మే 16, 2025 నుంచి మే 24, 2025 వరకు పరీక్షలు జరుగుతాయని ఐసీఏఐ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

రీషెడ్యూల్ చేసిన పరీక్షలను అదే పరీక్షా కేంద్రాల్లో, అదే సమయాల్లో - మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) / మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) నిర్వహిస్తామని ఐసీఏఐ తెలిపింది. అదనంగా, ఇప్పటికే జారీ చేసిన అడ్మిట్ కార్డులు రీషెడ్యూల్ తేదీలకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

పరీక్ష రివైజ్డ్​ షెడ్యూల్​తో పాటు పూర్తి నోటిఫికేషన్​ని చదవడానికి ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐసీఏఐ ప్రకారం, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫౌండేషన్ మే 2025 పరీక్ష.. షెడ్యూల్ ప్రకారం మే 15, 17, 19, 21, 2025 న జరుగుతుంది.

పరీక్ష ఏ రోజునైనా కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం / స్థానిక సెలవుదినంగా ప్రకటించినట్లయితే పరీక్ష షెడ్యూల్​లో ఎటువంటి మార్పు ఉండదని ఐసీఏఐ పేర్కొంది.

పైన చెప్పినట్టు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన నేపథ్యంలో ఐసీఏఐ పరీక్షలను వాయిదా వేసింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్, ఇంటర్మీడియట్, పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు పరీక్షలు [ఇంటర్నేషనల్ టాక్సేషన్ - అసెస్మెంట్ టెస్ట్ (ఐఎన్టీటీటీ ఏటీ)] మే 2025 మిగిలిన పేపర్లు మే 9 నుంచి మే 14, 2025 వరకు జరగాల్సి ఉంది.

మరిన్ని వివరాలకు విద్యార్థులు ఐసీఏఐ వెబ్సైట్​ను చూడాలని అధికారులు సూచించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం