పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య.. వైఎస్ భారతి నడిపిస్తున్న ఈ స్కూల్‌కు ఎందుకంత డిమాండ్-huge demand for admissions at pulivendula venkatappa school ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య.. వైఎస్ భారతి నడిపిస్తున్న ఈ స్కూల్‌కు ఎందుకంత డిమాండ్

పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య.. వైఎస్ భారతి నడిపిస్తున్న ఈ స్కూల్‌కు ఎందుకంత డిమాండ్

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలని.. వైఎస్సార్ కుటుంబం సంకల్పించింది. వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగన్ ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ బాధ్యతలను ఆయన సతీమణి భారతి చూసుకుంటారు. అదే వెంకటప్ప స్కూలు. ఈ పాఠశాలలో ప్రవేశాలకు బాగా డిమాండ్ ఉంటుంది.

వెంకటప్ప స్కూల్

పులివెందుల ప్రాంతంలో వెంకటప్ప స్కూలు చాలా ఫేమస్. వెంకటప్ప.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గురువు. వెంకటప్పపై గౌరవంతో దీన్ని ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో.. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ పాఠశాలను జగన్ 2007-08 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు.

వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా..

ఈ పాఠశాల పులివెందులలోని భాకరాపురం వైఎస్ జగన్ ఎస్టేట్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. వైఎస్ భారతి ఈ పాఠశాల కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలో అర్హులైన పేద విద్యార్థులందరికీ ఉచితంగా విద్య, దుస్తులు, పుస్తకాలు, ఇతర ఫీజులను వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

చరిత్ర..

ఈ పాఠశాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గురువు వెంకటప్ప జ్ఞాపకార్థంగా స్థాపించారు.

పేద, బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని ఏర్పాటు చేశారు.

ఈ పాఠశాల 2007-08 విద్యా సంవత్సరం నుండి కార్యకలాపాలు ప్రారంభించింది.

వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోంది.

ప్రత్యేకతలు..

ఇది ఇంగ్లీష్ మీడియం పాఠశాల.

పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, యూనిఫాం, పుస్తకాలు అందిస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న స్థానిక పిల్లలు ప్రవేశానికి అర్హులు.

ఈ పాఠశాలలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 46 తరగతి గదులు, ఒక లైబ్రరీ, ఒక సైన్స్ ల్యాబ్, ఒక యాక్టివిటీ రూమ్, ఒక రీడింగ్ హాల్, ఒక ఆడియో విజువల్ రూమ్ ఉన్నాయి.

విద్యార్థుల రాకపోకల కోసం రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

పాఠశాలలో కంప్యూటర్ విద్యను కూడా అందిస్తారు.

విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

ఆంగ్లంలో ప్రత్యేక వేసవి శిక్షణ కూడా ఇస్తారు.

పాఠశాల కరస్పాండెంట్ వైఎస్ భారతి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. నెలలో రెండుసార్లు పాఠశాలను సందర్శిస్తారు.

ఈ పాఠశాల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉంది.

ఇది కో-ఎడ్యుకేషనల్ (బాలురు, బాలికలు కలిసి చదువుకునే) పాఠశాల.

పూర్తి వివరాలు..

స్థలం- భాకరాపురం, పులివెందుల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 516390

విస్తీర్ణం- 15 ఎకరాలు

మౌలిక సదుపాయాల వ్యయం రూ.5 కోట్లు

తరగతులు- ప్రాథమిక, ఉన్నత పాఠశాల

బోధనా మాధ్యమం- ఆంగ్లం

గుర్తింపు- ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

యాజమాన్యం- వైఎస్ఆర్ ఫౌండేషన్

బోధనేతర సిబ్బంది- 31

సంబంధిత కథనం