ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మార్చి 1వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. అయితే అధికారులు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ పరీక్ష సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సబ్జెక్టుల వారీగా పీడీఎఫ్ కాపీలను విడుదల చేశారు.
పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 50 శాతంతో మిగిలిన వారు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 70 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
సంబంధిత కథనం