ఏపీలో ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ కసరత్తు కొలిక్కి వచ్చింది. గత ప్రభుత్వంలో పాఠశాలల హేతబద్దీకరణ పేరుతో జీవో 117కు ప్రత్యామ్నయంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన జీవోలు విడుదలయ్యాయి. తాజా నిర్ణయంతో మెగా డిఎస్సీలో భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులు కూడా తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విభజన పూర్తయింది. మొత్తం 9 రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ ప్రభు త్వం మంగళవారం 19, 20, 21 జీవోలను జారీ చేసింది. ఏపీలో పాఠశాల వర్గీకరణ, బోధనా సిబ్బంది వ్యవస్థీకరణ, పోస్టుల పంపిణీ, విధి విధానాలను ఖరారు చేస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాలల విభజన 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. అన్ని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పాఠశాలలకు వర్తింప చేస్తారు.
1. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (ప్రీ ప్రైమరీ 1, 2)
2. ఫౌండేషనల్ స్కూల్ (పీపీ 1. పీపీ 2, క్లాస్ 1, 2)
3. బేసిక్ ప్రైమరీ స్కూల్ (ప్రీ ప్రైమరీ 1, పీపీ2, 1నుంచి 5 తరగతులు)
4. మోడల్ ప్రైమరీ స్కూల్ (పేపీ 1, పీపీ2, క్లాస్ 1 నుంచి 5వరకు)
5. అప్పర్ ప్రైమరీ స్కూల్ (పీపీ 1,2 1 నుంచి 8వ తరగతి వరకు)
6. హైస్కూల్ (6-10 తరగతులు)
7. హైస్కూల్ (1-10 తరగతులు)
8. హైస్కూల్ ప్లస్ (6 నుంచి12 తరగతులు)
9. హైస్కూల్ ప్లస్ (1-12 తరగతులు)
జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లోని 2,215 మిగులు స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్-2 హెచ్ఎం పోస్టు లను మున్సిపాలిటీలకు బదలాయించారు. ఇందులో హెచ్ఎం పోస్టులు కార్పొరేషన్లకు 57, మున్సిపాలిటీలకు 38 కేటాయిం చారు.
ఇతర కోటా కింద గ్రేడ్-2 హెడ్ మాస్టర్లుగా 104 మంది, 2016 స్కూల్ అసిస్టెంట్లను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్దు బాటులో భాగంగా ఇతర మేనేజ్ మెంట్లకు మార్పు చేశారు. జడ్పీ ఉపాధ్యాయులను మునిసిపల్ స్కూళ్లకు బదిలీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ- 2025 నోటిఫికేషన్లలో 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం బోధనా సిబ్బంది పునర్వి భజన చేపట్టిన తర్వాత పోస్టుల సంఖ్యను తగ్గించింది. అన్ని జిల్లాల్లో కలిపి 13,192 పోస్టులు గుర్తించినట్టు ప్రకటించింది. సర్దుబాటు తర్వాత 3,155 పోస్టులు రద్దైనట్టు ప్రచారం జరుగుతోంది.
పాఠశాలలను విలీనం చేయడంతో 1-5 తరగతుల విద్యార్థులు కి.మీ దాటి, యూపీ విద్యార్థులు (6 నుం చి 8 తరగతులు) 3 కిలోమీటర్లు దాటి ప్రభుత్వ పాఠాశాలలకు వెళితే రవాణా ఖర్చుల కింద నెలకు రూ.600 చొప్పున చెల్లిం చనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం