సీయూఈటీ పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. సీయూఈఈటీ పీజీ-2025 ఫలితాలను ఎన్ టీఏ మంగళవారం విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/CUET-PG/ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీ విడుదలైన వెంటనే సీయూఈటీ పీజీ 2025 ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేసింది.
6,54,019 మంది రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు సీయూఈటీ పీజీ 2025 నిర్వహించారు. సీయూఈటీ (పీజీ)-2025లో మొత్తం 191 యూనివర్సిటీలు (సెంట్రల్/స్టేట్/ప్రైవేట్, ఇతరులు) పాల్గొంటున్నాయి. మొత్తం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల్లో 5,23,032 మంది పరీక్షకు హాజరయ్యారు.
సీయూఈటీ పీజీ 2025 ఫలితాలను ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
గత నెలలో సీయూఈటీ పీజీ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీ ని విడుదల చేశారు. వాటిపై కొందరు అభ్యర్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిశీలించి సీయూఈటీ పీజీ 2025 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు. సీయూఈటీ పీజీ 2025 పరీక్షను 2025 మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షలో 157 సబ్జెక్టులు ఉన్నాయి. అభ్యర్థులు గత సంవత్సరాలకు అనుగుణంగా నాలుగు టెస్ట్ పేపర్లు/ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కల్పించారు. 90 నిమిషాల చొప్పున 43 షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విశ్వవిద్యాలయాలు/ సంస్థలు/ అటానమస్ కాలేజీల్లోని అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహిస్తుంది. అభ్యర్థుల నమోదు, పరీక్ష నిర్వహణ, ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల, సవాళ్లను ఆహ్వానించడం, ఆన్సర్ కీలను ఖరారు చేయడం, ఫలితాలను సిద్ధం చేయడం, ప్రకటించడం, స్కోర్ కార్డును హోస్ట్ చేయడం వరకే ఎన్టీఏ పాత్ర ఉంటుంది. నీట్ పీజీ 2025కు సంబంధించిన తాజా వార్తలు, అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
సంబంధిత కథనం