CUET PG 2025 : సీయూఈటీ పీజీ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలా అప్లై చేయాలి?
CUET PG 2025 : సీయూఈటీ పీజీ పరీక్ష 2025 దరఖాస్తు గడువును ఎన్టీఏ పొడిగించింది. సీయూఈటీ పీజీకి 2025 ఫిబ్రవరి 8లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీయూఈటీ పీజీ పరీక్ష 2025 దరఖాస్తు గడువును తాజాగా పొడిగించింది. సీయూఈటీ పీజీ పరీక్షకు 2025 ఫిబ్రవరి 8లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in లేదా cuetpg.ntaonline.in వెళ్లి దరఖాస్తు చేయాలి. తేదీ పొడిగింపుతో పాటు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం స్క్రైబ్ నిబంధనను కూడా సడలించారు.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ఫారం నింపడానికి చివరి తేదీ 8 ఫిబ్రవరి 2025 (రాత్రి 11:50 గంటలవరకు). ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 9 ఫిబ్రవరి (రాత్రి 11:50 గంటల వరకు). దరఖాస్తు ఫారంలో దిద్దుబాటు - 10 ఫిబ్రవరి 2025 నుండి 12 ఫిబ్రవరి వరకుఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. మెుత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
ఫీజు వివరాలు
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1400 చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.700 అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1200 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ రెండు పేపర్లకు రూ.1100 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1000 ఫీజు చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అధికారిక CUET PG వెబ్సైట్ని సందర్శించండి.
హోమ్పేజీలో CUET-PG 2025 కోసం రిజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉంది.. లింక్పై క్లిక్ చేయండి.
CUET PG 2025 రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
న్యూ రిజిస్టర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
దరఖాస్తు ఫారమ్ను పూరించడానికి ముందు అన్ని సూచనలను జాగ్రత్తగా చదవండి.
పేర్కొన్న ఫార్మాట్లలో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి
దరఖాస్తు రుసుమును చెల్లించి, భవిష్యత్తు అవసరాల కోసం కాపీని సేవ్ చేయండి.