CUET PG: కామన్ యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (సీయూఈటీ పీజీ 2025) పరీక్ష సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు సీయూఈటీ పీజీ 2025 అధికారిక వెబ్ సైట్స్ cuetpg.ntaonline.in లేదా https://exams.nta.ac.in/CUET-PG/ సందర్శించడం ద్వారా తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను తెలుసుకోవచ్చు. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్లు సీయూఈటీ పీజీ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఎన్టీఏ పేర్కొంది.
2025-26 విద్యా సంవత్సరానికి సీయూఈటీ (పీజీ) - 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 8 వరకు కొనసాగింది. ఆ తరువాత కరెక్షన్ విండో ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఓపెన్ అయింది. 2025 మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో 90 నిమిషాల చొప్పున 43 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. 4,12,024 మంది రిజిస్టర్డ్ అభ్యర్థులకు 157 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తామని, గత సంవత్సరాలకు అనుగుణంగా నాలుగు పరీక్ష పేపర్లు/ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కల్పించారని పబ్లిక్ నోటీసులో పేర్కొన్నారు.
సీయూఈటీ (పీజీ) - 2025కు సంబంధించి మరిన్ని సందేహాలు, సహాయం కోసం అభ్యర్థులు 011-40759000/ 011 - 69227700 లేదా ఈమెయిల్ helpdesk-cuetpg@nta.ac.in సంప్రదించవచ్చు. తాజా అప్డేట్ల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా ఎన్టీఏ వెబ్సైట్(లు) www.nta.ac.in, https://exams.nta.ac.in/CUET-PG/ లను సందర్శిచాలని సూచించారు.