త్వరలో సీటెట్ 2025 నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలు తెలుసుకోండి!-ctet 2025 notification releasing soon at ctet nic in know registration steps eligibility and more details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  త్వరలో సీటెట్ 2025 నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలు తెలుసుకోండి!

త్వరలో సీటెట్ 2025 నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలు తెలుసుకోండి!

Anand Sai HT Telugu

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) 2025 నోటిఫికేషన్‌ను సీబీఎస్ఈ త్వరలో విడుదల చేయనుంది. సీటెట్ 2025కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అర్హత, రిజిస్ట్రేషన్ దశలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవాలి.

సీటెట్ 2025 (canva)

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) 2025 నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. నోటీసు కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. సీటెట్ జులై 2025 నోటిఫికేషన్‌ను ctet.nic.in అధికారిక వెబ్‌‌సైట్‌లో విడుదల చేయనున్నారు. సీటెట్ 2025కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అర్హత, రిజిస్ట్రేషన్ దశలు, ఇతర వివరాలు తెలుసుకోవాలి.

పేపర్-1, పేపర్-2

సీబీఎస్ఈ ఏటా రెండుసార్లు సీటెట్ పరీక్షను నిర్వహిస్తుంది. మొదటి పరీక్షను జూలై నెలలో, రెండో పరీక్షను డిసెంబరులో నిర్వహిస్తారు. సీటెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు. పేపర్ -2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయ, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

పేపర్-I (క్లాస్ 1-5)కు చెప్పేవారు 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ డి.ఎల్.ఎడ్/బి.ఎల్.ఎడ్/డి.ఎడ్ ఉండాలి. సీటెట్ పేపర్-2 (6వ తరగతి నుంచి 8వ తరగతి) దరఖాస్తు చేసుకునేవారికి గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణత కూడా ఉండొచ్చు.

ఎలా అప్లై చేయాలి?

ముందుగా అభ్యర్థి ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆ తర్వాత అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్/పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకుని, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపాలి. దీని తరువాత మీరు మీ తాజా ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. మీ దరఖాస్తు ఫారాన్ని సరిగ్గా తనిఖీ చేయాలి. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫీజును సబ్మిట్ చేయాలి.

సీటెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీకి 150 మార్కులకు గాను కనీసం 90 మార్కులు (60 శాతం), ఎస్సీ, ఎస్టీలకు 150 మార్కులకు 82 మార్కులు (55 శాతం) రావాలి. సీటెట్ పరీక్ష స్కోర్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్