JEE mains 2025 : ఈ టిప్స్ పాటిస్తే జేఈఈ మెయిన్స్లో నెగిటివ్ మార్కులకు చెక్!
JEE mains 2025 preparation tips : జేఈఈ మెయిన్స్ 2025కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇది మీకోసమే! పరీక్షలో నెగిటివ్ మార్కుల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే కొన్ని విలువైన టిప్స్ని ఇక్కడ తెలుసుకోండి..
ఇంకొన్ని రోజుల్లో జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ సెషన్ 1 ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అయితే, ఈ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో పాజిటివ్ మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో, నెగిటివ్ మార్క్ల నుంచి తప్పించుకోవడం కూడా అతే ముఖ్యం! ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ 2025లో నెగిటివ్ మార్కులను తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్ని టిప్స్ని ఇక్కడ తెలుసుకోండి..
జేఈఈ మెయిన్స్ 2025 ప్రిపరేషన్ టిప్స్..
ముందు ఎగ్జామ్ పాటర్న్ని అర్థం చేసుకోండి : జేఈఈ మెయిన్స్ 2025లో 300 మార్కుల కోసం 75 ప్రశ్నలు ఉంటాయి. మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలు ఉంటాయి. ప్రతి కరెక్ట్ సమాధానానికి 3 మార్కులు వస్తాయి. సమాధానం తప్పు అయితే ఒక మార్కు పోతుంది. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎలాంటి పాజిటివ్, నెగిటివ్ మార్కులు ఉండవు. పరీక్షలో గెస్వర్క్లను తగ్గించేందుకు ఈ జేఈఈ మెయిన్స్ నెగిటివ్ మార్కింగ్ సిస్టెమ్ని తీసుకొచ్చారు.
ముందు మీకు తెలిసింది చేయండి : ముందు క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు బాగా తెలుసు అన్న ప్రశ్నలను ఎంచుకోండి. వీటితో మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కఠిన ప్రశ్నలతో అస్సలు మొదలుపెట్టకండి. టైమ్ ఎక్కువపడుతుంది. మీ మీద స్ట్రెస్ పెరుగుతుంది.
గెస్వర్క్కి దూరంగా ఉండండి : జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో గెస్వర్క్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షల్లో గెస్వర్క్లు నష్టం చేస్తాయి. తప్పు సమాధానానికి మార్కులు పోతాయి. ప్రతి మార్కు చాలా కీలకం కదా! ప్రశ్నకు సమాధానం తెలిసినా, డౌట్గా ఉంటే.. దాన్ని స్కిప్ చేయండి. అక్యురసీ మీద ఫోకస్ చేయండి. ఇలా చేస్తేనే నెగిటివ్ మార్క్ల నుంచి తప్పించుకోగలరు. కచ్చితంగా సమాధానం ఇవ్వాలని అనిపిస్తే, ఎలిమినేషన్ ప్రాసెస్ చేపట్టండి. ఒక్కో ఆప్షన్ని తొలగిస్తూ రండి. ఇలా చేస్తే కరెక్ట్ సమాధానం ఇచ్చే ఛాన్స్లు పెరుగుతాయి.
టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యం : జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో టైమ్ మేనేజ్మెంట్ చాలా కీలకం. 3 గంటల పరీక్షలో ఎఫీషియెన్స్ చాలా అవసరం. టైమ్ని మీరు ఎంత బాగా వినియోగించుకోగలిగితే, చివరిలో ఒత్తిడి లేకుండా, నెగిటివ్ మార్కింగ్కి సంబంధించిన తప్పులు చేయరు.
పాత పేపర్లను సాల్వ్ చేయండి : పాత జేఈఈ క్వశ్చన పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తే మంచిది! పరీక్ష కఠినత్వంపై మీకు అంచనా వస్తుంది. అందుకు తగ్గట్టు ప్రిపేర్ అవుతారు. జేఈఈ సిలబస్లో అధిక వెయిటేజ్ ఉన్న ప్రశ్నలను ఎంచుకోండి. వాటిని సాల్వ్ చేయండి. మీ స్కోర్ పెరుగుతుంది. టైమ్ మిగులుతుంది.
ఫోకస్డ్గా ఉండండి : ఒత్తిడి, యాంగ్జైటీతో పరీక్షలో తప్పులు జరుగుతాయి. నెగిటివ్ మార్కులు పడతాయి. అందుకే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.
సమాధానాలు మళ్లీ చెక్ చేసుకోండి : జేఈఈ మెయిన్స్ సెషన్ 1లో ఇంకా టైమ్ మిగిలి ఉంటే, మీ సమాధానాలను మళ్లీ ఒకసారి చూసుకోండి. మీకే మంచిది.
ఈ టెక్నిక్స్ ఫాలో అయితే నెగిటివ్ మార్కుల టెన్షన్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జేఈఈ మెయిన్స్ 2025లో మంచి స్కోరు సాధించే అవకాశాలు పెరుగుతాయి.
సంబంధిత కథనం