కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు.. ఏప్రిల్ 28 వరకు అప్లికేషన్ లాస్ట్-central pollution control board recruitment for various posts application deadline is april 28 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు.. ఏప్రిల్ 28 వరకు అప్లికేషన్ లాస్ట్

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు.. ఏప్రిల్ 28 వరకు అప్లికేషన్ లాస్ట్

Anand Sai HT Telugu

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో వివిధ పోస్టులకు నియామకాలు ప్రక్రియ నడుస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫారమ్‌ను పూరించవచ్చు. 28 ఏప్రిల్ 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న వారికి గుడ్‌న్యూస్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీబీసీబీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ కింద అర్హులైన అభ్యర్థులను మొత్తం 69 పోస్టుల్లో నియమిస్తారు. 28 ఏప్రిల్ 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

పోస్టులు

ఈ నియామకంలో సైంటిస్ట్ బి, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ డ్రాట్స్‌మన్, జూనియర్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి అనేక ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు

ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు నిర్దేశించిన రుసుము చెల్లించాలి. పోస్టును బట్టి గంట, రెండు గంటల పరీక్షలు ఉంటాయి. 1 గంట పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 150 ఫీజు చెల్లించాలి.2 గంటల పరీక్షకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, అన్ని మహిళా అభ్యర్థులకు రూ.250గా ఫీజు నిర్ణయించారు.

ఇలా అప్లై చేయండి

ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు ముందుగా https://app1.iitd.ac.in/ పోర్టల్‌ను సందర్శించాలి. దీని తర్వాత క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలను నింపి.. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి. ప్రింటవుట్ తీసుకొని భద్రంగా ఉంచుకోవాలి. ఏప్రిల్ 28వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్