విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, నెలకు రూ.10 వేలు స్టైఫండ్ -డీజీఎఫ్టీ సమ్మర్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు విధానం ఇదే-central govt dgft summer internship 2025 for students stipend 10k per month application procedure ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, నెలకు రూ.10 వేలు స్టైఫండ్ -డీజీఎఫ్టీ సమ్మర్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు విధానం ఇదే

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, నెలకు రూ.10 వేలు స్టైఫండ్ -డీజీఎఫ్టీ సమ్మర్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు విధానం ఇదే

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఇంటర్నె షిప్ ప్రోగ్రామ్ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. రెండు నెలల పాటు ఇంటర్నెషిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. నెలకు రూ.10 వేలు స్టైఫండ్, సర్టిఫికెట్ అందిస్తుంది.

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్, నెలకు రూ.10 వేలు స్టైఫండ్ -డీజీఎఫ్టీ సమ్మర్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు విధానం ఇదే

విద్యార్థులు, ఔత్సాహికులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) సమ్మర్ ఇంటర్న్ షిప్ 2025 ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఫారిన్ ట్రేడ్ పాలసీలో విద్యార్థులను భాగం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఇంటర్న్ షిప్ లో నెలకు రూ.10,000 స్టైఫండ్, సర్టిఫికెట్, స్కిల్ డెవలప్మెంట్ లభిస్తుంది.

ఇంటర్న్‌షిప్ గురించి

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ చాలా కాలంగా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను అమలుచేస్తుంది. భారత ఫారిన్ ట్రేడ్ పాలసీని రూపొందించడంలో కీలక పాత్ర పోషింటే డీజీఎఫ్టీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్న్ షిప్ అందిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పబ్లిక్ పాలసీ/ఆర్థిక శాస్త్రం/చట్టం/అధ్యయనాలు/పరిశోధనలు చేసే డైరెక్టరేట్ అధికారులతో విద్యార్థులు కలిసి పనిచేయవచ్చు. ఇంటర్న్‌షిప్ విద్యార్థుల కెరీర్ పురోగతి, వృత్తిపరమైన నైపుణ్యంలో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.

ఈ పథకం లక్ష్యం

ఈ ఇంటర్న్‌షిప్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే, ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానాన్ని రూపొందించే మొత్తం ప్రక్రియ, సూక్ష్మ స్థాయిలో డీజీఎఫ్టీ అమలు, గ్లోబల్ ట్రేడ్, ఎనకామిక్స్, పబ్లిక్ పాలసీపై ఇంటర్న్‌లకు లోతైన అవగాహన కల్పిస్తారు.

అర్హత

జాతీయ న్యాయ పాఠశాలలు/కేంద్ర విశ్వవిద్యాలయాలు/AICTE గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు/గుర్తింపు పొందిన జాతీయ సంస్థలు/విదేశీ విశ్వవిద్యాలయాలు లేదా ఇతర అత్యుత్తమ సంస్థల నుంచి పబ్లిక్ పాలసీ/ఆర్థిక శాస్త్రం/మేనేజ్మెంట్/లా....గ్రాడ్యుయేషన్ డిగ్రీ (కనీసం 60% మార్కులతో) కలిగి ఉన్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎకనామిక్స్/ఫైనాన్స్/మేనేజ్‌మెంట్/లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న లేదా కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం భారతదేశంలో నివసిస్తున్న లేదా విదేశాలలో రీసెర్చ్ చేస్తు్న్న భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వ్యవధి

2025-26 సంవత్సరంలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (జూన్ నుంచి జులై వరకు) కోసం ఇంటర్న్‌షిప్ వ్యవధి గరిష్టంగా 2 నెలల వరకు ఉంటుంది.

నివేదిక సమర్పణ

ఇంటర్న్‌లు తమ ఇంటర్న్‌షిప్ ముగింపులో డివిజన్ హెడ్‌కి ఒక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్

ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన తర్వాత, సంబంధిత డివిజన్ హెడ్ కు నివేదిక సమర్పించిన తర్వాత వాటిని మూల్యాంకనం చేసి తర్వాత ఇంటర్న్‌లకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆసక్తిగల విద్యార్థులు ఈ కింద లింక్‌తో తమ దరఖాస్తును సమర్పించడానికి గూగుల్ ఫారమ్‌ను పూర్తిచేయాలి.

అభ్యర్థి తన కోర్సు సమయంలో ఇంటర్న్‌షిప్‌లో చేరడానికి ఆసక్తి ఉంటే, తన సూపర్‌వైజర్ / డిపార్ట్‌మెంట్ హెడ్ నుంచి అనుమతి లేఖను సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తిగల విద్యార్థులు తమ దరఖాస్తును ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 26, 2025 వరకు సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీలు

1. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2025

2. అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ తేదీ: ఏప్రిల్ 28, 2025

3. ఇంటర్వ్యూ తేదీ: మే 2 నుంచి మే 13, 2025

4. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: మే 15, 2025

5. ఇంటర్న్‌షిప్ వ్యవధి: జూన్ 1, 2025 నుండి జులై 31, 2025

ఎంపిక విధానం

దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ఇ-మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు. స్లాట్‌ల లభ్యత, సంబంధిత విభాగం అధికారి ఆమోదానికి లోబడి ఉంటుంది. ఎంపిక కమిటీ నిర్ణయం ఫైనల్. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రశ్నలను స్వీకరించరు.

తొలగింపు

డీజీఎఫ్టీ ఏ కారణం చూపకుండానే ఏ సమయంలోనైనా ప్రోగ్రామ్‌ను ముగించమని ఇంటర్న్‌కు సూచించవచ్చు. ఈ విషయంలో డీజీఎఫ్టీదే తుది నిర్ణయం అవుతుంది. ఇంటర్న్ కోరుకుంటే ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించడానికి ఎంచుకోవచ్చు, ఇందుకు డీజీఎఫ్టీకి 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి.

ప్రదేశం

న్యూఢిల్లీలోని డీజీఎఫ్టీ ప్రధాన కార్యాలయం ఇంటర్న్‌లను ప్రతి డివిజన్ హెడ్ లకు జతచేస్తుంది. విద్యార్థులు వారికి నేరుగా నివేదించాలి.

వేతనం

ఇంటర్న్‌లకు నెలకు రూ.10,000 వేతనం చెల్లిస్తారు. ఇది కాకుండా, మరే ఇతర వేతనం లేదా చెల్లింపు ఉండదు. ఇది జీతం కాదని స్పష్టం చేస్తారు. ఇంటర్న్‌లు డీజీఎఫ్టీ ఉద్యోగులు కాదు, డీజీఎఫ్టీతో భవిష్యత్తులో ఏదైనా ఉపాధికి హామీ ఉండదు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం