సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్! మంగళవారం ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్ఈ.. మధ్యాహ్నం 1 గంటకు క్లాస్ 10 రిజల్ట్స్ని సైతం ప్రకటించింది. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
2025 సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో మొత్తం మీద 93.66శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఇది 93.60శాతంగా నమోదైంది. ఈసారి 23,71,939 మంది పరీక్ష రాయగా, వీరిలో 22,21,636 మంది పాసయ్యారు. ఇక అబ్బాయిల కన్నా అమ్మాయిలు మెరుగైన ప్రదర్శన చేశారు. బాలుర పాస్ పర్సెంటేజ్ 92.63శాతంగా ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం (95%..) అబ్బాయిల కన్నా 2.3శాతం అధికంగా ఉంది.
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను ఇంటర్నెట్ అవసరం లేకుండా ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టెమ్)తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే..
స్టెప్ 1- ఏరియా కోడ్తో సహా 24300699 నెంబర్ని కాల్ చేయండి.
స్టెప్ 2- వాయిస్ సేవల ద్వారా విద్యార్థులు సబ్జెక్టు వారీగా మార్కులను వినొచ్చు.
స్టెప్ 1- కొత్త మెసేజ్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2- cbse10roll no for CBSE Class 10 result టైప్ చేయండి.
స్టెప్3- 7738299899 కి మెసేజ్ పంపండి.
స్టెప్ 4- సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు మొబైల్ నెంబర్కి వస్తాయి.
2. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల లింక్ మీద ట్యాప్ చేయండి.
3. మీ లాగిన్ క్రెడెన్షియల్స్- అంటే రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ ఫిల్ చేయండి.
4. రిజల్ట్స్ని వీక్షించడానికి “సబ్మిట్” బటన్పై క్లిక్ చేయండి.
5. మీ ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి. భవిష్యత్ రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి.
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై, మార్చ్ 1, 2025న ముగిసింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష 2025 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగింది.అన్ని రోజులూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్లో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షల కోసం సుమారు 44 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
సంబంధిత కథనం