CBSE Recruitment 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ (recruitment) డ్రైవ్ ద్వారా సంస్థలో 212 పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తుకు చివరి తేదీ- 2025 జనవరి 31 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అన్ రిజర్వ్ డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఒక్కో పోస్టుకు రూ.800 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్ మెన్/ మహిళలు/ డిపార్ట్ మెంటల్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపిక ప్రక్రియలో రెండు అంచెల పరీక్ష, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ (క్వాలిఫయింగ్ స్వభావం) ఉంటాయి. ఆబ్జెక్టివ్ (ఎంసీక్యూ) టైప్ (ఓఎంఆర్ బేస్డ్) టైర్-1 పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను టైర్-2 రాత (డిస్క్రిప్టివ్) పరీక్షకు అనుమతిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో టైర్-1 (ఎంసీక్యూ) పరీక్ష ఉంటుంది. టైర్-1 (ఎంసీక్యూ) పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్ (క్వాలిఫయింగ్ నేచర్)కు పిలుస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ (cbse) అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.