సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాయ్స్ పై బాలికలదే పైచేయి; పూర్తి వివరాలు-cbse class 12 results girls outperform boys slight dip in number of students with over 90 percent score ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాయ్స్ పై బాలికలదే పైచేయి; పూర్తి వివరాలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాయ్స్ పై బాలికలదే పైచేయి; పూర్తి వివరాలు

Sudarshan V HT Telugu

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే 13, మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఈ ఏడాది 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇది గత ఏడాది ఉత్తీర్ణత శాతం అయిన 87.98 కన్నా స్వల్పంగా ఎక్కువ.

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాయ్స్ పై బాలికలదే పైచేయి

సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే 13న విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. వారి ఉత్తీర్ణతా శాతం బాలుర కన్నా ఐదు శాతానికి పైగా అధికంగా ఉంది. అలాగే, మొత్తంగా, 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గిందని బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ మంగళవారం తెలిపారు.

లాస్ట్ ఈయర్ కన్నా బెటర్

సీబీఎస్ఈ 12వ తరగతిలో గత ఏడాది 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 88.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12 వ తరగతి ఫలితాల్లో బాలికలు 91.64 శాతం ఉత్తీర్ణ సాధించగా, బాలురు 85.70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు గత ఏడాది 50 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి రెట్టింపు ఉత్తీర్ణత సాధించారు.

90 శాతం పైగా సాధించిన స్టూడెంట్స్

ఈ సంవత్సరం సీబీఎస్ఈ 12వ తరగతిలో 1,11,544 మంది అభ్యర్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. 24,867 మంది అభ్యర్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. గతేడాది 12వ తరగతిలో 1.16 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా, 24,068 మంది 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల్లో 290 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ఉన్నారు. ఈ కేటగిరీలో 55 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు.

విజయవాడలో అత్యధికం

ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు 16,92,794 మంది పరీక్షకు హాజరుకాగా, 1.29 లక్షల మందికి పైగా కంపార్ట్మెంటల్ పరీక్షకు హాజరయ్యారు. గత ఏడాది 1.22 లక్షలతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది. విజయవాడ రీజియన్ లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, త్రివేండ్రంలో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రయాగ్ రాజ్ రీజియన్ లో అత్యల్పంగా 79.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాలల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు అత్యధికంగా 99.9 శాతం ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా ప్రైవేటు లేదా స్వతంత్ర పాఠశాలలు 87.94 శాతం ఉత్తీర్ణత సాధించాయి. విదేశీ పాఠశాలల్లో గత ఏడాది 95.84 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈసారి 95.01 శాతానికి తగ్గింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం