రేపటివరకే సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల వివరాల్లో మార్పులకు అవకాశం-cbse class 10th class 2025 loc correction window closes tomorrow at cbsegovin ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  రేపటివరకే సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల వివరాల్లో మార్పులకు అవకాశం

రేపటివరకే సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల వివరాల్లో మార్పులకు అవకాశం

Sudarshan V HT Telugu

ఎల్ఓసీ కరెక్షన్ విండోను ఏప్రిల్ 17, 2025న సీబీఎస్ఈ మూసివేయనుంది. ఈ కరెక్షన్ విండో ద్వారా సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల వివరాల్లో, ఆయా పాఠశాలలు మార్పులు చేయవచ్చు. అయితే, కొన్ని నిర్దేశించిన వివరాలను మాత్రమే మార్చడానికి వీలుంటుంది.

సీబీఎస్ఈ

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2025 ఏప్రిల్ 17 న ఎల్ఓసి కరెక్షన్ విండోను మూసివేస్తుంది. పాఠశాలలు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in ద్వారా ఎల్ఓసీ డేటాలో దిద్దుబాట్లు చేయవచ్చు. సరైన పాఠశాల రికార్డుతో పాటు అభ్యర్థుల సరైన డేటాను అప్లోడ్ చేయడానికి, సీఏఎంసీ పోర్టల్ ద్వారా విద్యార్థుల వివరాల్లో దిద్దుబాటు చేయడానికి రేపటి వరకు అన్ని పాఠశాలలకు అవకాశం ఉంటుంది.

ఈ మార్పులు మాత్రమే

ఈ ఎల్ఓసీ కరెక్షన్ విండో ద్వారా తల్లి/తండ్రి పేర్లలో ఒకరి పేరు స్థానంలో మరొకరి పేరు వస్తే, ఆ దిద్దుబాటు చేయవచ్చు. అలాగే, విద్యార్థి పేరు, తల్లి/తండ్రి పేరు సవరణ (చిన్న దిద్దుబాట్లు మాత్రమే అనుమతించబడతాయి) చేయవచ్చు. సరైన ఫొటోను అప్ లోడ్ చేయవచ్చు. పుట్టిన తేదీలో తప్పులను (నిబంధనల ప్రకారం, సంబంధిత సహాయక పత్రాల ఆధారంగా మాత్రమే అనుమతించబడతాయి) సవరించవచ్చు. సింగిల్ చైల్డ్ ఫీల్డ్ లో అప్ డేట్ చేయవచ్చు. అభ్యర్థి, తల్లిదండ్రుల పేర్లను పూర్తిగా మార్చడానికి అనుమతించరు.

ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది

రెగ్యులర్ అభ్యర్థుల రికార్డుల్లో దిద్దుబాటుకు ఒక్కో అభ్యర్థికి రూ.1000 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. ఈ ఫీజును పాఠశాలలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయంలో జమ చేస్తాయి. చాలా పాఠశాలలు తప్పుడు డేటాను సమర్పించినట్లు గుర్తించిన బోర్డు 2025 ఏప్రిల్ 9 న ఈ కరెక్షన్ విండోను తెరిచింది. అభ్యర్థుల వివరాలను సరిదిద్దుకునేందుకు ఈ సదుపాయం కల్పించడం ద్వారా అభ్యర్థులకు సరైన ఫలితం, మార్కుల స్టేట్ మెంట్ ను అందించవచ్చు.

ఫలితాల కోసం ఎదురు చూపు

ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను బోర్డు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు నిర్వహించింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు దేశ, విదేశాల్లోని 8,000 పాఠశాలలకు చెందిన 44 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లలో 10వ తరగతి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటించినప్పుడు, విద్యార్థులు రోల్ నంబర్, పాఠశాల నంబర్ మరియు పుట్టిన తేదీ వంటి వివరాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

Sudarshan V

eMail
వీ సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియాతో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ పదవులలో పనిచేశారు. తనకు జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకునే వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆటోమోటివ్, సాంకేతిక పరిణామాలపై ఆసక్తి ఉంది.

సంబంధిత కథనం