సీబీఎస్ఈ 10, 12వ తరగతి రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలి?-cbse board exam revaluation re verification and recounting step by step guide to apply ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీబీఎస్ఈ 10, 12వ తరగతి రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలి?

సీబీఎస్ఈ 10, 12వ తరగతి రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలి?

Anand Sai HT Telugu

సీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షలో మీకు మంచి మార్కులు రాకపోతే, మీ ఫలితాలపై మీరు అసంతృప్తిగా ఉంటే బాధపడకండి. మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం (HT)

ీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతి పరీక్షల్లో మీకు మంచి మార్కులు రాకపోతే మరో ఆప్షన్ కూడా ఉంది. అయితే మీరు రాసిన సమాధానాలు సరిగా ఉన్నాయని, అయినా మీకు మార్కులు తక్కువగా వచ్చాయని మీకు అనిపిస్తే.. ఫలితాలను సరిదిద్దడానికి, మెరుగుపరచడానికి అవకాశం ఉంది. ఇందులో రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఉంటాయి. ఇందుకోసం సీబీఎస్ఈ cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు చెల్లించాలి

ఏదైనా సబ్జెక్టులో మీరు బాగా రాసినా మార్కులు తక్కువ వచ్చాయని అనిపిస్తే.. దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి పేపర్‌కు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ బోర్డు తరఫున రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కాపీని మరోసారి పరిశీలించి మళ్లీ మార్కులు ఇస్తారు.

సరిదిద్దుతారు

ఆన్సర్ కాపీలోని పేజీల మార్కులు మెయిన్ పేజీలో సరిగా ఇవ్వకపోతే సరిదిద్దుతారు. ఇచ్చిన మొత్తం మార్కుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుతారు. ఏదైనా ప్రశ్నను చెక్ చేయకుండా మిస్ చేస్తే దాన్ని చెక్ చేస్తారు. అన్ని మార్కులను కౌంట్ చేసి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. రీవాల్యుయేషన్ ఫలితంగా మార్కులు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా మునుపటి మాదిరిగానే ఉండవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

3. ఆ తర్వాత మీరే రిజిస్టర్ చేసుకోవాలి.

4. ఇప్పుడు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.

5. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు సబ్మిట్ చేయాలి.

6. సబ్మిట్ క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

7. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోండి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.