సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2025 అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in, results.cbse.nic.in విడుదల కానున్నాయి. 2025 ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి.
సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు ఎగ్జామ్ 2025 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18, 2025 వరకు జరిగింది. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలకు 24.12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను త్వరలో విడుదల అవుతాయి. డిజిలాకర్, ఉమాంగ్ యాప్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
డిజిలాకర్లో సీబీఎస్ఈ బోర్డు 10వ, 12వ తరగతి ఫలితాలు 2025ను కూడా తనిఖీ చేయవచ్చు. రిజల్ట్ చెక్ చేసుకోవాలంటే digilocker.gov.in వెళ్లాలి. తరువాత మీరు లాగిన్ కావాలి. ఆ తర్వాత సీబీఎస్ఈ 10/12వ తరగతి ఫలితాల విభాగానికి వెళ్లాలి. రోల్ నంబర్, పాఠశాల నంబర్ మొదలైన వివరాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. తర్వాత మీ రిజల్ట్ మీ స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది.
ప్లేస్టోర్కు వెళ్లి ఉమాంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో ఖాతాను సృష్టించాలి. ఫలితాలు ప్రకటించిన తర్వాత యాప్లో రిజల్ట్ లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్పై క్లిక్ చేయాలి. తర్వాత వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దీని తరువాత, ఫలితం స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది.
ఫలితాలను చెక్ చేసుకోవాలంటే ముందుగా సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in results.cbse.nic.in వెళ్లండి. హోమ్ పేజీలో టెన్త్/12వ తరగతి పరీక్షా ఫలితాల లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి రోల్ నెంబర్ సబ్మిట్ చేయండి. రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.