సీఏ (ఛార్టర్డ్అ అకౌంటెంట్) అభ్యర్థులకు గుడ్ న్యూస్! సీఏ ఫైనల్ పరీక్షలను ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు కాకుండా, మూడుసార్లు నిర్వహిస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తాజాగా ప్రకటించింది. ఇది 2025 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను సంవత్సరానికి మూడుసార్లు నిర్వహించాలని గత ఏడాది ఐసీఏఐ నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు సీఏ ఫైనల్ పరీక్షలు కూడా అదే బాటలో నడుస్తాయని ఐసీఏఐ తెలిపింది.
“ప్రపంచ ఉత్తమ విధానాలకు అనుగుణంగా, విద్యార్థులకు ఎక్కువ అవకాశాలను అందించడానికి, సీఏ ఫైనల్ పరీక్షను సంవత్సరానికి మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ 26వ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు జరిగేది,” అని ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇకపై సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ అనే మూడు స్థాయిల్లోనూ ప్రతి ఏటా సమాన సంఖ్యలో అంటెప్ట్స్ జరుగుతాయని, దీని వల్ల విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టెమ్స్ ఆడిట్లో కూడా మార్పులు జరుగుతాయని ఐసీఏఐ తెలిపింది.
గతంలో ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబర్ నెలల్లో) నిర్వహించే ఈ కోర్సు అసెస్మెంట్ టెస్ట్ని ఇకపై ఏడాదికి మూడుసార్లు (ఫిబ్రవరి, జూన్, అక్టోబర్) నిర్వహిస్తామని, ఇది సభ్యులకు ప్రాప్యతను, సౌలభ్యాన్ని మరింత పెంచుతుందని ఐసీఏఐ తెలిపింది.
దేశంలో ఉన్న అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఫైనల్స్ ఒకటి. దీని కోసం విద్యార్థులు చాలా కష్టపడుతుంటారు. ఈ తరుణంలో సీఏ ఫైనల్స్ని మూడుసార్లు నిర్వహించాలన్న ఐసీఏఐ నిర్ణయం విద్యార్థులకు కచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంకో విషయం! హెచ్టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్లో అందుబాటులో ఉంది. కెరీర్ సంబంధిత లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్లో హెచ్టీ తెలుగు ఛానెల్ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం