బీఐఎస్‌లో ఉద్యోగం పొందడానికి సూపర్ ఛాన్స్.. జీతం 75 వేలు-bis recruitment 2025 apply for consultant posts salary 75000 check other details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  బీఐఎస్‌లో ఉద్యోగం పొందడానికి సూపర్ ఛాన్స్.. జీతం 75 వేలు

బీఐఎస్‌లో ఉద్యోగం పొందడానికి సూపర్ ఛాన్స్.. జీతం 75 వేలు

Anand Sai HT Telugu

బీఐఎస్‌(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌)లో కన్సల్టెంట్ పోస్టుకు నియామకాలు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75 వేల జీతం ఇస్తారు.

బీఐఎస్‌ రిక్రూట్‌మెంట్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి గొప్ప అవకాశం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామక ప్రక్రియ 19 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు 9 మే 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఐఎస్ అధికారిక వెబ్‌సైట్ bis.gov.inలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి సంబంధిత రంగంలో వ్యవసాయ శాస్త్రం / సాయిల్ సైన్స్‌లో B.Sc / B.Tech / BE / BNYS / మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

దరఖాస్తుదారులను విద్యార్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. దీని తరువాత ఎంపికైన అభ్యర్థులను సాంకేతిక మూల్యాంకనం, ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు.

జీతం

కన్సల్టెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75 వేల జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగం పూర్తిగా కాంట్రాక్ట్ ఆధారితమైనది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక సైట్‌ను చూడవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి

అభ్యర్థులు ముందుగా BIS అధికారిక వెబ్‌సైట్‌ bis.gov.inను సందర్శించాలి.

తర్వాత హోమ్‌పేజీలోని రిక్రూట్‌మెంట్ విభాగానికి వెళ్లి సంబంధిత రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఖాతా సృష్టించుపై క్లిక్ చేసి, అవసరమైన సమాచారాన్ని పూరించి నమోదు చేసుకోండి.

అభ్యర్థులు లాగిన్ అయి పూర్తి ఫారమ్ నింపాలి.

తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫారమ్‌ను సమర్పించండి.

చివరగా దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకొని తమ వద్ద సేవ్ చేసుకోవాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్