AP Group 2 Mains Hall Ticket 2025 : ఏపీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి-appsc group ii mains exam hall tickets released direct link here for hall tickets download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Group 2 Mains Hall Ticket 2025 : ఏపీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP Group 2 Mains Hall Ticket 2025 : ఏపీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 13, 2025 01:48 PM IST

APPSC Group 2 Mains Hall Ticket 2025 : ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్‌ హాల్‌ టికెట్స్‌ విడుదల
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్‌ హాల్‌ టికెట్స్‌ విడుదల

ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. మెయిన్స్ పరీక్షలకు హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు… ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా… ఏప్రిల్ లో ఫలితాలను ప్రకటించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. వీరంతా కూడా మెయిన్స్ రాయనున్నారు.

గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇలా:

  • ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే గ్రూప్ II సర్వీసెస్ హాల్ టికెట్ ఆప్షన్ పై నొక్కాలి.
  • OTPR ఐడీ, పాస్ వర్డ్ ను ఎంట్రీ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఏపీపీఎస్సీ ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల జనవరి 5న మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా పడింది. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. మొత్తం 899 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకటన 2023 డిసెంబర్ లో జారీ అయింది.

గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా…. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17 శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలోని 26 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయిస్తారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం