ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల.. మే 3 నుంచి 9వరకు మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ-appsc group 1 mains hall tickets released mains exams to be conducted from may 3rd t ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల.. మే 3 నుంచి 9వరకు మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల.. మే 3 నుంచి 9వరకు మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ

Sarath Chandra.B HT Telugu

ఏపీపీఎస్సీ ఉద్యోగ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే 3 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి రాజబాబు సూచించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 హాల్‌ టిక్కెట్ల విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షలు మే 3 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో పది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు ‍హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. ఏపీపీఎస్సీ కమిషన్‌ వెబ్‌ సైట్‌లో గ్రూపు-1 హాల్ టిక్కెట్లను విడుదల చేశారు.

గ్రూప్‌ 1హాల్ టిక్కెట్ల కోసం ఈ లింకును అనుసరించండి…

https://applications-psc.ap.gov.in/Download_HallTickets/

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజ బాబు పలు సూచనలు చేశారు. మొత్తం 7 పరీక్షలను ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వ హించనున్నారు.

గ్రూప్‌ 1 మెయిన్స్ షెడ్యూల్ ఇదే..

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ తేదీలు

(ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 01.00 వరకు)

03.05.2025 - తెలుగు(క్వాలిఫైయింగ్ పేపర్)

04.05.2025 -ఇంగ్లీష్ పేపర్ (క్వాలిఫైయింగ్ పేపర్)

05.05.2025 -పేపర్-I - జనరల్ ఎస్సే(సమకాలీన అంశాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు)

06.05.2025 - పేపర్-II - భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక శాస్త్రం

07.05.2025 - పేపర్-III - పాలిటిక్స్, రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్

08.05.2025 -పేపర్-IV - భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, డెవలప్మెంట్

09.05.2025 -పేపర్-V- సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు

డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షల నిర్వహణ

గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. క్వశ్చన్ పేపర్ ను ట్యాబ్‌ల్లో ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ కు మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,496 మంది మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై అయ్యారు.

మెయిన్స్ పరీక్ష విధానం

ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితో పాటు తెలుగు, ఇంగ్లిష్ క్వాలిఫై పేపర్లు ఉంటాయి. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ నిర్వహించనున్నారు. మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 825 మార్కులకు మెయిన్స్ నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ కు 180 నిమిషాలు కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ నిర్వహిస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం