ఏపీ ఈఏపీసెట్‌ 2025కు అప్లయ్ చేశారా..? తక్కువ ఫైన్ తో ఛాన్స్, ముఖ్య తేదీలివే-applications are being accepted for ap eapcet 2025 with fine know these dates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఈఏపీసెట్‌ 2025కు అప్లయ్ చేశారా..? తక్కువ ఫైన్ తో ఛాన్స్, ముఖ్య తేదీలివే

ఏపీ ఈఏపీసెట్‌ 2025కు అప్లయ్ చేశారా..? తక్కువ ఫైన్ తో ఛాన్స్, ముఖ్య తేదీలివే

ఏపీ ఈఏపీసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఫైన్ లేకుండా ఏప్రిల్ 24వ తేదీతో గడువు ముగియగా… ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. రూ. 1000 ఫైన్ తో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఆ తర్వాత ఆలస్య రుసుం పెరుగుతుంది.

ఏపీ ఈఏపీ సెట్‌ 2025 దరఖాస్తులు

ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మా అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 24వ తేదీతో సాధారణ గడువు ముగియగా… ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఇందుకు మే 16వ తేదీ వరకు అవకాశం ఉంది. తక్కువ ఫైన్ తో మాత్రం… మే 1 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులు - ముఖ్య తేదీలు

  • ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు.
  • రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • రూ. 1000 ఫైన్ తో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రూ. 2000 ఆలస్య రుసుంతో మే 7వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
  • రూ. 4000 ఫైన్ తో మే 12వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • రూ. 10 వేల ఆలస్య రుసుంతో మే 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మే 6వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.

ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 46 కేంద్రాలు ఏర్పాటు చేయగా… హైదరాబాద్‌లో రెండు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయి. మే 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని వెబ్ సైట్ లేదా వాట్సాప్(మన మిత్ర) ద్వారా పొందవచ్చు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరుగుతుంది. ప్రాథమిక కీ మే 21వ తేదీన విడుదలవుతుంది. మే 21 నుంచి 25వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.

ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష మే 21 నుంచి 27 తేదీల్లో జరుగుతుంది. మే 28వ తేదీన ప్రిలిమినరీ కీలను విడుదల చేస్తారు. జూన్ 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 5వ తేదీన ఫైనల్ కీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం