ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లేదా వాట్సాప్ మన మిత్ర లేదా స్కూళ్ల లాగిన్ల ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 19 నుంచి మే 28 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు విడుదల చేశారు. రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థుల హాల్ టికెట్లు విడుదల చేశారు.
ఈ హాల్ టికెట్లను సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్లు తమ స్కూల్ కోడ్, పాస్వర్డ్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in ద్వారా విద్యార్థుల హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.
ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ 9552300009 కు Hi అని మెసేజ్ పెట్టాలి. అందులో "Educational Services" ఎంపిక చేసి పదో తరగతి సప్లిమెంటరీ హాల్టికెట్ను పొందవచ్చు.
సంబంధిత కథనం