ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి-ap ssc supplementary exam 2025 results released here direct link to check score ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు www.bse.ap.gov.in/ లింక్ తో చెక్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ లోనూ మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ - 2025 ఫలితాలు వచ్చేశాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పదో తరగతి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 1,23,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 76.14 శాతం మంది ఉత్తీర్ణులైయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 73.55గా నమోదు కాగా.. బాలికలది 80.10 శాతం ఉత్తీర్ణత ఉంది. 98.24 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా…. పశ్చిమ గోదావరి జిల్లా 50.24 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  1. ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు - 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ విద్యార్థి రూల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా…

టెన్త్ విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'SSC ASE May 2025 Result- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.

Step 5 : పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.