ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్..! ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగుతో పాటు పదో తరగతి బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ లోనూ చెక్ చేసుకోవచ్చు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో ఏపీ పదో తరగతి 2025 ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి క్లిక్ చేస్తే క్షణాల వ్యవధిలోనే మీ మార్కులు డిస్ ప్లే అవుతాయి.
మరోవైపు ఏపీ పదో తరగతి బోర్డు వెబ్ సైట్ లోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఈసారి జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్టవ్యాప్తంగా 81.14 శాతం నమోదైనట్లు తెలిపింది. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉండగా… బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత 5.78 శాతం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 పాఠశాలల్లో సున్నా శాతం నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీ టెన్త్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93. 90 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 47.67 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈసారి విడుదలైన ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇందుకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకునే వీలు ఉంది. మే 1 వరకు ఇందుకు అవకాశం ఉండగా… రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం అయితే ప్రతి సబ్జెక్ట్ కు రూ. 1000 చెల్లించాలి. సీఎఫ్ఎంఎస్ విధానంలోనే ఈ ఫీజులను చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.
సంబంధిత కథనం