AP SSC Exam Results 2025 : ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్ - మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి-ap ssc exam results 2025 out direct link here to check marks details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Ssc Exam Results 2025 : ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్ - మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

AP SSC Exam Results 2025 : ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్ - మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

ఏపీ పదో తరగతి 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాలను HT తెలుగు వెబ్ సైట్ లో వేగంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పదో తరగతి బోర్డు వెబ్ సైట్ లోనూ అందుబాటులో ఉన్నాయి.

ఏపీ టెన్త్ ఫలితాలు 2025 (image source istock)

ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్..! ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగుతో పాటు పదో తరగతి బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ లోనూ చెక్ చేసుకోవచ్చు.

HT తెలుగులో సులభంగా పొందండి ఇలా…

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో ఏపీ పదో తరగతి 2025 ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి క్లిక్ చేస్తే క్షణాల వ్యవధిలోనే మీ మార్కులు డిస్ ప్లే అవుతాయి.

ఏపీ పదో తరగతి 2025 ఫలితాల లింక్: https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result

మరోవైపు ఏపీ పదో తరగతి బోర్డు వెబ్ సైట్ లోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.

వాట్సాప్ లోనూ ఏపీ టెన్త్ ఫలితాలు

  • ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయండి.
  • ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోండి.
  • 'డౌన్‌లోడ్ ఏపీ టెన్త్ రిజల్ట్స్- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయండి.
  • పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.

బాలికలదే హవా….

ఈసారి జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్టవ్యాప్తంగా 81.14 శాతం నమోదైనట్లు తెలిపింది. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉండగా… బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత 5.78 శాతం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 పాఠశాలల్లో సున్నా శాతం నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది.

టాప్ లో మన్యం జిల్లా

ఏపీ టెన్త్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93. 90 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 47.67 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈసారి విడుదలైన ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • పార్వతీపురంమన్యం జిల్లా -93.90%
  • కోనసీమ జిల్లా- 91.43%
  • విశాఖ - 89.14%
  • గుంటూరు - 88.53%
  • అనకాపల్లి - 88.44%
  • తూర్పు గోదావరి - 87.99%
  • విజయనగరం - 87.04%
  • ఎన్టీఆర్ - 85.68%
  • ప్రకాశం - 85.43%
  • కృష్ణా జిల్లా - 85.32%
  • పల్నాడు - 84.15%
  • బాపట్ల - 83.96%
  • నెల్లూరు - 83.58%
  • శ్రీకాకుళం - 82.41%
  • కాకినాడ - 82.24%
  • పశ్చిమగోదావరి - 82.15%
  • నంద్యాల - 81.85%
  • కడప - 80.78%
  • తిరుపతి -79.83%
  • అన్నమయ్య -77.61%
  • ఏలూరు - 77.24%
  • సత్యసాయి -74.79%
  • అనంతపురం - 70.07%
  • చిత్తూరు - 67.06%
  • కర్నూలు - 66.01%
  • అల్లూరి జిల్లా - 47.64%

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇందుకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకునే వీలు ఉంది. మే 1 వరకు ఇందుకు అవకాశం ఉండగా… రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం అయితే ప్రతి సబ్జెక్ట్ కు రూ. 1000 చెల్లించాలి. సీఎఫ్ఎంఎస్ విధానంలోనే ఈ ఫీజులను చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం