ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ - ముఖ్య వివరాలు
- ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ (మొదటి విడత) జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
- మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ అభ్యర్థుల వరకు ఫీజు చెల్లించుకోవాలి. ఇందుకు జూన్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
- ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.
- ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను ఎంట్రీ చేయాలి.
- జూలై 3వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత పాలిసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
- అలాట్ మెంట్ కాపీని https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.
- హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.
- మెయిల్ ఐడీ - convenorpolycetap2025@gmail.com
- హెల్ప్ లైన్ నెంబర్లు - 7995681678, 7995865456, 9177927677 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు).
గత నెలలో ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.