ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేయగా… కొత్తగా తేదీలను ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా… రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.వెబ్ ఆప్షన్లు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ర్యాంకుల ఆధారంగా… జూలై 5వ తేదీ వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు (వెబ్ ఆప్షన్లు) చేసుకోవాలి. ఫీజు కూడా చెల్లించాలి. https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి. అయితే జూలై6వ తేదీన అభ్యర్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు వారు ఎంచుకున్నవెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. జూలై 9వ తేదీన సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూలై 10వ తేదీ నుంచి14 తేదీల మధ్య రిపోర్టింగ్ చేయాలి. జూలై 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇక 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు polycetap.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. వీరికి ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.