ఏపీ పీజీఈసెట్‌ - 2025 రిజల్ట్స్ విడుదల... ఈ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి-ap pgecet 2025 results out direct link here to download rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ పీజీఈసెట్‌ - 2025 రిజల్ట్స్ విడుదల... ఈ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

ఏపీ పీజీఈసెట్‌ - 2025 రిజల్ట్స్ విడుదల... ఈ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

ఏపీ పీజీఈసెట్‌ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు cets.apsche.ap.gov.in/PGECET/ వెబ్ సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో 93.55 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు వచ్చేశాయి. ఈసారి మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఏపీ పీజీఈసెట్‌ - 2025లో భాగంగా…. 13 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 14,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 11,244 మంది అర్హత సాధించారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు కానుంది.

ఏపీ పీజీఈసెట్‌ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/PGECET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని ర్యాంక్ కార్డుపై లింక్ క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీఈసెట్‌ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. వ్యూ ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా…

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ పీజీఈసెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'ఏపీ పీజీఈసెట్ ఫలితాలు - 2025' పై క్లిక్ చేయాలి.

Step 4 : మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.

ఏపీ పీజీఈసెట్ ఎంట్రెన్స్ పరీక్షలోని ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.