ఏపీ పీజీసెట్‌- 2025 ఫలితాలు… ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap pgcet 2025 results are out direct link here to download rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ పీజీసెట్‌- 2025 ఫలితాలు… ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ పీజీసెట్‌- 2025 ఫలితాలు… ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ పీజీసెట్‌ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు cets.apsche.ap.gov.in/PGCET/ వెబ్ సైట్ లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

పీజీసెట్‌-2025 ఫలితాలు

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 21,995 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా… 19,488 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఏపీ పీజీసెట్‌ -2025లో మొత్తం 88.6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈఏడాది శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహించింది. మొత్తం 31 సబ్జెక్టుల్లో ప్రవేశాలకు జూన్‌ 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు.

ఏపీ పీజీసెట్‌ 2025 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  • అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/PGCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్,హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఏపీ పీజీసెట్‌ 2025 ర్యాంక్ కార్డు - డౌన్లోడ్ ఇలా

  1. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/PGCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్,హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.