ఏపీ పీజీసెట్ 2025 అప్డేట్స్ - మీ సబ్జెక్ట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap pgcet 2025 entrance exam syllabus released follw these steps for download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ పీజీసెట్ 2025 అప్డేట్స్ - మీ సబ్జెక్ట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ పీజీసెట్ 2025 అప్డేట్స్ - మీ సబ్జెక్ట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ పీజీసెట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు మే 5వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సబ్జెక్టుల వారీగా సిలబస్ వివరాలను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు…

ఏపీ పీజీసెట్ 2025

ఏపీలోని పీజీ ప్రవేశాలకు నిర్వహించే పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(AP PGCET-2025) ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 5వ తేదీతో పూర్తవుతుంది. ఆ తర్వాత లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మే 25 వరకు అవకాశం కల్పించారు.

పీజీ ప్రవేశాలకు కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వెబ్ సైట్ లో సిలబస్ వివరాలను పొందుపరిచారు. మొత్తం 31 సబ్జెక్టులకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. ఫలితంగా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాలకు చెందిన కోర్సుల సిలబస్ ను అభ్యర్థులు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 9 నుంచి పరీక్షలు….

ఈ ఏడాది ఏపీ పీజీసెట్ ను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఎంఏ /ఎంకాం/ ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక జూన్‌ 9 నుంచి 13 వరకు ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. ఏపీ పీజీసెట్ - 2025కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఇక్కడ హోం పేజీలో కనిపించే AP PGCET-2025 పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ హోం పేజీలో కనిపించే సిలబస్ అనే ఆప్షన్ పై నొక్కాలి.
  4. సబ్జెక్టుల వారీగా వివరాలు ఉంటాయి. ఇందులోనే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాలు ఉంటాయి.
  5. మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ పై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ నొక్కి సిలబస్ కాపీని పొందవచ్చు.

ఏపీ పీజీసెట్ - 2025కు దరఖాస్తు చేసుకనే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.850, బీసీల‌ు రూ.750 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.650గా నిర్ణయించారు. ఈ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

సాధార‌ణంగా ప్ర‌వేశ ప‌రీక్ష మూడు కేట‌గిరీల్లో ఉంటుంది. కేట‌గిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్‌, సోష‌ల్ సైన్సెస్ కోర్సులు ఉండ‌గా, కేట‌గిరీ-2లో కామ‌ర్స్ అండ్ ఎడ్యుకేష‌న్ కోర్సు ఉంది. ఇక కేట‌గిరీ-3లో సైన్స్ స‌బ్జెక్టులు నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి.

ఇక ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వంద మార్కులకు నిర్వహిస్తారు. అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం లేదు. ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం