ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 22వ తేదీతో పూర్తవుతుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మే 23వ తేదీన జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలను ప్రకటిస్తారు. మే 24వ తేదీన మెరిట్ జాబితాలను సిద్ధం చేస్తారు. మే 26వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితాలను ప్రదర్శిస్తారు. మే 27వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ లో తరగతులు ప్రారంభమవుతాయి.
ఇంటర్ ప్రవేశాలకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://cse.ap.gov.in లేదా https://apms.apcfss.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఓసీ, బీసీ, ఈడబ్యూఎస్ విద్యార్థులు దరఖాస్తు ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. మిగతా వారు రూ. 150 చెల్లించాలి. మెరిట్ జాబితాతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.