ఏపీ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి-ap model school inter first year admission 2025 applications will be ends on may 22 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

ఏపీ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి

ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మే 22వ తేదీతో ముగుస్తుంది. అర్హులైన విద్యార్థులు apms.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు 2025

ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 22వ తేదీతో పూర్తవుతుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మెరిట్ ఆధారంగా ఎంపిక….

మే 23వ తేదీన జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలను ప్రకటిస్తారు. మే 24వ తేదీన మెరిట్ జాబితాలను సిద్ధం చేస్తారు. మే 26వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితాలను ప్రదర్శిస్తారు. మే 27వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ లో తరగతులు ప్రారంభమవుతాయి.

ఇంటర్ ప్రవేశాలకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://cse.ap.gov.in లేదా https://apms.apcfss.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఓసీ, బీసీ, ఈడబ్యూఎస్ విద్యార్థులు దరఖాస్తు ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. మిగతా వారు రూ. 150 చెల్లించాలి. మెరిట్ జాబితాతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

  1. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు https://apms.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ముందుగా నిర్ణయించిన ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
  4. చివరగా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఏపీ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించుకోవచ్చు…

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.