AP Model School Exam 2025: ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap model school 6th class entrance exam hall tickets 2025 released direct link herestory ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Model School Exam 2025: ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP Model School Exam 2025: ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP Model School Entrance Exam 2025 : ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. apms.apcfss.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2025

ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ మోడల్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్ష తేదీ మార్పు…

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీన ఈస్టర్‌ పర్వదినం ఉండటంతో తేదీని మార్చారు. దీంతో ఏప్రిల్ 21వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా… 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు.

ఏప్రిల్‌ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారివారి మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ మోడల్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో ఆరో తరగతి ప్రవేశాలు(APMS - VI (Class) అని ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ విద్యార్థి విద్యార్థి ఐడీ వివరాలు, పుట్టిన తేదీతో పాటు వెరిఫికేషన్ కోడ్ ఎంట్రీ చేయాలి.
  4. లాగిన్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  6. పరీక్షా కేంద్రంలోకి వెెళ్లేందుకు హాల్ టికెట్ తప్పనిసరి.

ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 5వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. ఓసీ, బీసీ విద్యార్థులకు 35 మార్కులను అర్హతగా నిర్ణయించగా… ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30గా ఉంది. ఈ లోపు మార్కులు సాధించకపోతే క్వాలిఫై కానట్లు పరిగణిస్తారు. స్కోర్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

రాష్ట్రంలో మొత్తం 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఇంకా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 22వ తేదీ వరకు ఉంటుంది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.