ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, రేపటి నుంచి మాక్ టెస్టులు-ap mega dsc 2025 mock tests starting tomorrow prepare for teacher recruitment ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, రేపటి నుంచి మాక్ టెస్టులు

ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, రేపటి నుంచి మాక్ టెస్టులు

ఏపీ డీఎస్సీ 2025 మాక్ టెస్ట్ లు రేపటి(మే 20) నుంచి ప్రారంభంకానున్నాయి. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ లాగిన్ లో మాక్ టెస్టులు రాయవచ్చు.

ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, రేపటి నుంచి మాక్ టెస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 16,347 పోస్టులకు 5,67,067 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ తెలిపింది.

డీఎస్సీ-2025 మాక్ టెస్ట్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ రాయవచ్చు.

ఏపీ డీఎస్సీ 2025 : మాక్ టెస్ట్ అంటే ఏమిటి?

మాక్ టెస్ట్ అసలు పరీక్ష తరహా ఉంటుంది. అయితే, అసలు పరీక్ష లాంటి పరిస్థితుల్లో అభ్యర్థులను పరీక్షిస్తుంది. మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు పరీక్ష తీరుతెన్నులు, నిర్మాణం తెలుసుకుని పరీక్షలో అడిగే ప్రశ్నల రకాన్ని తెలుసుకుంటారు.

ఏపీ డీఎస్సీ మాక్ టెస్ట్ ఎలా రాయాలి?

  1. అభ్యర్థు లు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  2. హోమ్ పేజీలో ఇచ్చిన 'Candidate Login' పై క్లిక్ చేయండి.
  3. మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
  4. అనంతరం మాక్ టెస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి, పరీక్ష రాయండి.

మే 30న మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లను మే 30న విడుదల చేస్తారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. చివరి పరీక్ష పూర్తయిన రెండో రోజు మెగా డీఎస్సీ పరీక్ష ప్రారంభ కీని విడుదల చేయనున్నారు.

ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఏడు రోజుల పాటు తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ తర్వాత తుది ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఏపీ డీఎస్సీ ఫలితాలు-2025 తుది ఆన్సర్ కీ విడుదలైన ఏడు రోజుల్లో విడుదల చేయనున్నారు.

సీబీటీ ఆధారంగా

ఏపీ డీఎస్సీ రిక్రూట్మెంట్ లో మొత్తం 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నియామక పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు.

పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించాలి.

5.67 లక్షల దరఖాస్తులు

ఏపీ మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్‌ 20న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే 15తో ముగిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్లు విద్యాశాఖ తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5.67 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం