ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లను సిద్ధం చేసింది. రేపట్నుంచే(జూన్ 6) ఈ పరీక్షలు ప్రారంభమై… జూలై 6వ తేదీతో ముగుస్తాయి. నెల రోజులపాటు జరిగే ఈ పరీక్షలను…. ప్రతి రోజూ రెండు సెషన్లవారీగా పూర్తి చేస్తారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఏమైనా తప్పులు ఉంటే… పరీక్షా కేంద్రాల వద్ద సరిచేసుకోవచ్చని తాజాగా విద్యాశాఖ అధికారులు తెలిపారు.