ఏపీ లాసెట్ 2025 ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి-ap lawcet and pglcet 2025 results released direct link here to download rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ లాసెట్ 2025 ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ లాసెట్ 2025 ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు

ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయ విద్య కాలేజీల్లోని మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు… cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం… లాసెట్ కు మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మూడేళ్లు, ఐదేళ్ల లా, పీజీ ఎంట్రెన్స్ పరీక్షలన్నీ కలిపి 95 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ఏపీ లాసెట్ 2025 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి:

  1. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే లాసెట్ ఫలితాలపై క్లిక్ చేయండి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా…

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ లాసెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'ఏపీ లాసెట్ ఫలితాలు - 2025' పై క్లిక్ చేయాలి.

Step 4 : మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.

లాసెట్ ఎంట్రెన్స్ పరీక్షలోని ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.