గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైఫండ్ తో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్స్-ఇలా దరఖాస్తు చేసుకోండి-ap higher education aicte internship program for graduates how to apply ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైఫండ్ తో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్స్-ఇలా దరఖాస్తు చేసుకోండి

గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైఫండ్ తో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్స్-ఇలా దరఖాస్తు చేసుకోండి

ఏపీ ఉన్నత విద్యామండలి, అఖిల భారత్ సాంకేతిక విద్యా మండలితో కలిసి సుమారు 3 లక్షల విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లు అందించనున్నాయి. ఈ మేరకు విద్యార్థులు మే 18లోపు సంబంధిత పోర్టల్ దరఖాస్తు చేసుకోవాలి.

గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైఫండ్ తో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్స్-ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలితో కలిసి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందిస్తు్న్నాయి. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు మే 18 లోపు సంబంధిత వెబ్ సైట్ https://internship.aicte-india.org/ లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో సాధారణ ఇంటర్న్‌షిప్‌లతోపాటు ఉపకార వేతనాలు ఇచ్చేవి అందుబాటులో ఉన్నాయి.

మే 25 లోపు ఇంటర్న్ షిప్ లు

డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులు https://internship.aicte-india.org/ ఇంటర్న్ షిప్ పోర్టల్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత విద్యా సంస్థల మెంటార్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. మే 25లోపు విద్యార్థులకు ఇంటర్న్‌ షిప్‌ లు కేటాయిస్తారు. ఇంటర్న్ షిప్ సమయంలో కొన్ని సంస్థలు రూ.5 వేల నుంచి రూ.25 వేల స్టైఫండ్‌ ఇవ్వనున్నాయి.

ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఏఐసీటీఈ వేసవి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. సుమారు మూడు లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్టైపెండ్, ఉచిత ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్ అందించాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించారు.

ఏపీ ఉన్నత విద్యామండలి ఇంటర్న్‌షిప్ డాష్‌బోర్డ్‌ను శుక్రవారం ఛైర్మన్ ప్రొఫెసర్ కె.మధు మూర్తి, ఏఐసీటీఈ సీవోవో డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్, ఐఐటీ-ఎమ్ ప్రొఫెసర్ పార్థసారథి ప్రారంభించారు. ఏఐసీఈటీ ప్రతినిధులు రోహిత్ భరద్వాజ్, సూరజ్ కుమార్ ఇంటర్న్‌షిప్ పోర్టల్‌పై ఓరియంటేషన్ సెషన్‌లను నిర్వహించారు. విద్యార్థులకు అపార్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించారు.

స్టైఫండ్ ప్రోగ్రామ్స్

స్టైఫండ్, ఉచిత సర్టిఫికేషన్ ఇంటర్న్‌షిప్‌లు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఏపీ ఉన్నత విద్యామండలి, ఏఐసీఈటీ, ఐఐటీ మద్రాస్, ఇస్రో, డీఎస్టీ, బీబీటీ, ఐసీఎస్ఎస్ఆర్, యూజీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యంతో ఈ ఇంటర్న్ షిప్ లు నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు అధికారిక ఇంటర్న్‌షిప్ పోర్టల్‌ను సందర్శించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ చేసి ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం