ఏపీ ఎడ్‌సెట్‌ -2025కు దరఖాస్తు చేశారా..? లేట్ ఫీజు లేకుండా మరికొన్ని గంటలే గడువు..!-ap edcet 2025 updates online applications will ends on may 14 without late fee ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఎడ్‌సెట్‌ -2025కు దరఖాస్తు చేశారా..? లేట్ ఫీజు లేకుండా మరికొన్ని గంటలే గడువు..!

ఏపీ ఎడ్‌సెట్‌ -2025కు దరఖాస్తు చేశారా..? లేట్ ఫీజు లేకుండా మరికొన్ని గంటలే గడువు..!

ఏపీ ఎడ్‌సెట్‌ 2025 దరఖాస్తుల ప్రక్రియ దగ్గరపడింది. ఎలాంటి ఫైన్ లేకుండా మే 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ ఎడ్‌సెట్‌ 2025

ఏపీలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉండటంతో… అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ ఎడ్‌సెట్‌ 2025ను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నిర్వహిస్తోంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా.. 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఆన్ లైన్ దరఖాస్తు - ముఖ్య తేదీలు:

ఏపీ ఎడ్‌ సెట్‌ 2025కు దరఖాస్తులను ఆన్‌లైన్‌ పద్ధతిలో స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.450 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ.1000 గడువుతో మే 19వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఇక రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 24 వరకు, రూ.4 వేలతో మే 26 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.10 వేల ఫైన్ తో మే 27 నుంచి జూన్‌ 3 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మే 30 నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జూన్‌ 5వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

  1. ఏపీ ఎడ్‌సెట్‌ - 2025కు దరఖాస్తు చేసుకునేందుకు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ముందుగా నిర్ణయించిన దరఖాస్తు ఫీజును చెల్లించాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డుతో పాటు అభ్యర్థి వివరాలు అవసరమవుతాయి.
  3. అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత…. దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేసుకోవచ్చు.
  4. పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే ప్రాసెస్ చేసుకోవచ్చు.
  5. చివరగా సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఎడ్ సెట్ - 2025కు దరఖాస్తు చేసుకోవచ్చు…

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.