ఏపీ ఎడ్‌సెట్ - 2025 ఫ‌లితాలు విడుద‌ల‌ - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap edcet 2025 results are out here direct link to check rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఎడ్‌సెట్ - 2025 ఫ‌లితాలు విడుద‌ల‌ - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఎడ్‌సెట్ - 2025 ఫ‌లితాలు విడుద‌ల‌ - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఎడ్ సెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి బీఈఈ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. cets.apsche.ap.gov.in/EDCET లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఏపీ ఎడ్ సెట్ 2025 ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 14,527 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.

ఫ‌లితాల‌ను ఇలా చెక్ చేసుకోండి…

  1. అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఎడ్ సెట్ - 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబ‌ర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట‌ర్ చేయాలి.
  4. సబ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే ఫ‌లితాలు డిస్ ప్లే అవుతాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా…

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ ఎడ్ సెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు - 2025' పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేష్ నెంబర్ ను నమోదు చేయాలి.

Step 4 : సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.

ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగిలిన అభ్యర్థులందరికీ 150 మొత్తం మార్కులకు 37 మార్కులు (అంటే 25%) అర్హత మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ర్యాంకింగ్ కోసం ఎటువంటి అర్హత మార్కులు లేవు. ఫిజికల్ సైన్సెస్ / మ్యాథమెటిక్స్ మెథడాలజీలలో మహిళలకు కనీస అర్హత మార్కులు వర్తించవు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.