ఏపీ ఈసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లో ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అనంతపురం జేఎన్టీయూ నిర్వహించిన ఈసెట్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మొత్తం 35,187 మంది పరీక్షలకు హాజరవ్వగా…31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.
డిప్లమా, బీఎస్సీ(గణితం) డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్ చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు. మే 6న నిర్వహించిన ఈసెట్ ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.
ఏపీ ఈసెట్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అమ్మాయి గంగా భవాని బీఎస్సీ(గణితం) విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసెట్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్య్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ ఈసెట్-2025 పరీక్షను మే 6న నిర్వహించారు. రెండు విడతలుగా ఏపీ ఈసెట్ పరీక్షను జేఎన్టీయూ నిర్వహించింది. మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి.
ఏపీ ఈసెట్ మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో కూడా ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఏపీ ఈసెట్ పరీక్షకు మొత్తం 35,187 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,922 మంది అర్హత సాధించారు.
ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. మంత్రి లోకేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం