ఏపీ ఈసెట్‌ -2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల... ముఖ్య తేదీలివే-ap ecet counseling 2025 to begin from july 4 key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఈసెట్‌ -2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల... ముఖ్య తేదీలివే

ఏపీ ఈసెట్‌ -2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల... ముఖ్య తేదీలివే

ఏపీఈసెట్‌ - 2025 అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. జూలై 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ 2025

బీటెక్‌ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ - 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు….. జూలై 4 నుంచి ఫీజు చెల్లించుకోవచ్చు. జూలై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

ముఖ్య తేదీలు…

  • ఏపీ ఈసెట్‌ - 2025 కౌన్సెలింగ్‌ జూలై 4 నుంచి ప్రారంభమవుతుంది.
  • అర్హులైన అభ్యర్థులు జూలై 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపుతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • జూలై 4 వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల అప్ లోడ్ కుఅవకాశంఉంటుంది.
  • జూలై 7వ తేదీ నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
  • జూలై 11వ తేదీన వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది.
  • జూలై 13వ తేదీన సీట్లను కేటాయిస్తారు.
  • సీట్లు పొందిన విద్యార్థులు 14 నుంచి 17లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
  • జూలై 14వ తేదీ నుంచి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను అనంతపురం జేఎన్టీయూ చూస్తోంది. ఈ ఏడాది మొత్తం 35,187 మంది పరీక్షలకు హాజరవ్వగా…31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. డిప్లమా, బీఎస్సీ(గణితం) డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్ చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు. మే 6వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ ఈసెట్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అమ్మాయి గంగా భవాని బీఎస్సీ(గణితం) విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

ఈసెట్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్య్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంకులతో పాటు రిజర్వేషన్లు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం