ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల, మే 6న రెండు విడతల్లో నిర్వహణ-ap ecet 2025 exam schedule released to be conducted in two phases on may 6 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల, మే 6న రెండు విడతల్లో నిర్వహణ

ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల, మే 6న రెండు విడతల్లో నిర్వహణ

ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ ను అనంతపురం జేఎన్టీయూ విడుదల చేసింది. మే 6న రెండు విడతల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల, మే 6న రెండు విడతల్లో నిర్వహణ

ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ 2025 జరగనుంది. మే 6న ఏపీ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. మే 6న రెండు విడతలుగా ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహణకు జేఎన్టీయూ షెడ్యూల్ విడుదల చేసింది.

మే 6న రెండు విడతల్లో

జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు మాట్లాడుతూ...ఏపీ ఈసెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ ఈసెట్ మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వీసీ సుదర్శనరావు తెలిపారు.

మొత్తం 35,187 దరఖాస్తులు

ఏపీ ఈసెట్ పరీక్షకు మొత్తం 35,187 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, క్యాలి క్యులేటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ ఉంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం