ఏపీ ఈసెట్ - 2025 అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ గడువు ఏప్రిల్ 26వ తేదీతో ముగియనుంది.
ఏపీ ఈసెట్ - 2025 ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి.. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) అభ్యర్థులకు లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్ను అనంతపురం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
ఏపీ ఈసెట్ - 2025కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆలస్య రుసుంతో కొనసాగుతోంది. రూ. 10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 28వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. అధికారులు సూచిస్తున్నారు.
ఏపీ ఈసెట్ - 2025 పరీక్షలను మే 6వ తేదీన నిర్వహించనున్నారు. ఆన్లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రిలిమినరీ కీ మే 8వ తేదీన విడుదలవుతుంది. వీటిపై అభ్యంతరాలను మే 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. అధికారిక వెబ్సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
సంబంధిత కథనం