ఏపీ ఈసెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇదిగో లింక్-ap ecet 2025 application correction window open make changes till april 26 direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఈసెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇదిగో లింక్

ఏపీ ఈసెట్ 2025 అభ్యర్థులకు అలర్ట్ - 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇదిగో లింక్

ఏపీ ఈసెట్-2025 కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఫైన్ తో ఇంకా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఏపీ ఈసెట్ 2025

ఏపీ ఈసెట్ - 2025 అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ఆధారంగా ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ గడువు ఏప్రిల్ 26వ తేదీతో ముగియనుంది.

ఏపీ ఈసెట్ - 2025 ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి.. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) అభ్యర్థులకు లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ ఈసెట్‌ను అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

ఏపీ ఈసెట్ - 2025కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆలస్య రుసుంతో కొనసాగుతోంది. రూ. 10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 28వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. అధికారులు సూచిస్తున్నారు.

అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - ప్రాసెస్ ఇలా

  • అభ్యర్థులు ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఏపీ ఈసెట్ - 2025 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • హోం పేజీలో కనిపించే కరెక్షన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి పేమెంట్ ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత తప్పుగా ఉన్న వివరాలను సవరించుకోవచ్చు.
  • చివర్లో సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.

మే 6న ఎంట్రెన్స్ ఎగ్జామ్..

ఏపీ ఈసెట్ - 2025 పరీక్షలను మే 6వ తేదీన నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రిలిమినరీ కీ మే 8వ తేదీన విడుదలవుతుంది. వీటిపై అభ్యంతరాలను మే 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. అధికారిక వెబ్‌సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం