ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్… మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap eapcet 2025 results declared here direct link to download rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్… మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్… మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు.. cets.apsche.ap.gov.in/EAPCET వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వివరాలను మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వివరాలను వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఏపీఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఉత్తీర్ణత శాతం వివరాలు ఇవే…

ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 75460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 89.8 శాతం క్వాలిఫై అయ్యారు.

ఇక ఇంజినీరింగ్ స్టీమ్ లో చూస్తే… 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 71.65 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ లో మొదటి ర్యాంకర్ గా అనిరుధ్‌ రెడ్డి నిలిచారు. రెండో ర్యాంకర్ గా భాను రెడ్డి, మూడో ర్యాంకర్ గా యస్వంత్‌ సాధ్విక్‌ ఉన్నారు.

మే నెలలో పరీక్షలు…

ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 28వ తేదీన ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. మే 30వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. దీంతో ఫలితాలను ఇవాళ విడుదల చేశారు.

ఏపీ ఈఏపీసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి..

  • పరీక్షలు రాసిన విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/EAPCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ తో పాటు పలు వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మార్కులతో పాటు ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మనమిత్రలో ఇలా…

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఏపీ ఈఏపీసెట్ -2025 ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : ' ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : 'హాల్ టికెట్' నెంబర్‌ తో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేయాలి.

Step 5 : PDF రూపంలో ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్లను కూడా ప్రమాణికంగా తీసుకుంటారు. ఫలితాల వెల్లడించిన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విడతల వారీగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కు అవకాశం ఇస్తారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.