ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. మార్చి 12న ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 24 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు చేయడానికి మరొక్క రోజు మాత్రమే గడువు మిగిలింది. ఈఏపీ సెట్ 2025కు వెయ్యి రుపాయల జరిమానాతో మే 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 7వ తేదీ వరకు 2వేల రుపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 6 నుంచి మే 8వ తేదీ వరకు దరఖాస్తుల కరెక్షన్ విండో ఓపెన్ అవుతంది. రూ.4వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.10వేల ఆలస్య రుసుముతో మే 16వరకు దరఖాస్తు చేయవచ్చు.
మే 12 నుంచి ఈఏపీ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేస్తారు. మే 19,20తేదీలలో ఈఏపీ సెట్ నిర్వహిస్తారు. జూన్ 6న ఫలితాలు విడుదల చేస్తారు.
ఏపీ ఈఏపీ సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ మంగళ వారం తెలిపారు. ఈఏపీ సెట్ 2025కు ఇప్పటివరకు 3,41,355 మంది దర ఖాస్తు చేసుకున్నారని.. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 46 కేంద్రాలు, హైదరాబాద్లో రెండు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు వెల్లడించారు. మే 12 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.
దరఖాస్తుదారులు సమాచార నమోదులో పొరపాటు జరిగితే హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించాలన్నారు. మే 6 నుంచి 8 లోగా సవరించుకునేందుకు అవకాశం కల్పి స్తామని వివరించారు.
ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఏపీ ఈఏపీ సెట్ 2025 నిర్వహిస్తున్నారు.
ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పూర్తి స్థాయి నోటిఫికేషన్ మార్చి 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు
https://cets.apsche.ap.gov.in/ లో అందుబాటులోకి ఉంటాయి.
సంబంధిత కథనం