ఏపీ డీఎస్సీ దరఖాస్తులు- టెట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్లు మర్చిపోయారా? ఇలా సింపుల్ గా తెలుసుకోండి?-ap dsc 2025 applications ap tet marks or hall ticket number here how to easily find them ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డీఎస్సీ దరఖాస్తులు- టెట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్లు మర్చిపోయారా? ఇలా సింపుల్ గా తెలుసుకోండి?

ఏపీ డీఎస్సీ దరఖాస్తులు- టెట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్లు మర్చిపోయారా? ఇలా సింపుల్ గా తెలుసుకోండి?

ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 15తో డీఎస్సీ దరఖాస్తులు ముగుస్తాయి. అయితే డీఎస్సీ దరఖాస్తులో టెట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్లు అప్లోడ్ చేయాలి. టెట్ మార్కులు మర్చిపోతే వాటిని తిరిగి తెలుసుకునేందుకు ఇలా చేయండి.

ఏపీ డీఎస్సీ దరఖాస్తులు- టెట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్లు మర్చిపోయారా? ఇలా సింపుల్ గా తెలుసుకోండి?

డీఎస్సీ దరఖాస్తుల్లో టెట్ మార్కులు, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థులు చాలా ఏళ్లుగా డీఎస్సీ కోసం వేచిచూడడం, ప్రిపరేషన్ లో ఉండడంతో టెట్ మార్కులు మర్చిపోతున్నారు. దీంతో దరఖాస్తు సమయంలో వారికి ఇబ్బంది మారుతోంది. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం టెట్ ఐడీ, మార్కులను ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో అందుబాటులో ఉంచారు.

టెట్ ఐడీ, మార్కులు ఎలా తెలుసుకోవాలి?

  1. ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ పై క్లిక్ చేయండి.
  2. హోం పేజీలో 'Forgot/Know Candidate ID/Previous TET Marks' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థి మొబైల్ నెం/ఆధార్ నెంబర్/హాల్ టికెట్ వివరాలను నమోదు చేయాలి.
  4. ఆ తర్వాత గెట్ డిటేల్స్ పై క్లిక్ చేస్తే అభ్యర్థి రాసి మొత్తం టెట్ పరీక్షల వివరాలు, మార్కులు స్క్రీన్ పై కనిపిస్తాయి.

డీఎస్సీ దరఖాస్తులో ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మే 15తో దరఖాస్తులు ముగుస్తాయి. డీఎస్సీ దరఖాస్తుల్లో ముందు నుంచీ సమస్యలు తలెత్తున్నాయి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అభ్యర్థుల పొరపాట్లు

ముందు స్టడీ, ఒరిజనల్ సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌ చేయాలని కోరడంతో ఇబ్బందులు తలెత్తాయి. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మంత్రి నారా లోకేష్‌ సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌ కేవలం ఆప్షనల్‌ మాత్రమేనని చెప్పడంలో అభ్యర్థులు కాస్త రిలీఫ్‌ పొందారు. అయితే తాజాగా అభ్యర్థులకు మరో సమస్య తల నొప్పిగా మారింది.

అప్లికేషన్ లో పుట్టిన తేదీ, ఆధార్‌ వివరాలు తప్పుగా నమోదు చేసిన వారు, వాటిని తిరిగి చేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్ ఇవ్వకపోవడంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు ఎడిట్ కోసం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

దరఖాస్తు సమయంలో

దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్ల కారణంగా అభ్యర్థులు పేరు, అడ్రస్ వంటి వివరాలు తప్పులు నమోదు చేశారు. వాటిని ఎడిట్‌ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. అయితే పుట్టిన తేదీ వివరాలు, ఆధార్‌ ఎడిట్‌కు మాత్రం ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆ వివరాలను సరిదిద్దుకునే వెసులుబాటు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

డీఎస్సీ గడువు పెంచాలి

డీఎస్సీ గడువు, వయోపరిమితి, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభ్యర్థులు ర్యాలీలు చేశారు. నిరుద్యోగులు పోరాట ఫలితంగా ఏడేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని అభ్యర్థులు అన్నారు. పరీక్షకు కనీసం 90 రోజులను సమయం ఇవ్వాలని కోరుతున్నారు.

వయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయిన వారికి వయస్సు పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 47 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచిందన్నారు.

ఏపీ ప్రభుత్వం కూడా 47 సంవత్సరాలకు వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. నార్మలైజేషన్ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.