TG SSC Exams 2025 : రేపట్నుంచే తెలంగాణ పదో తరగతి పరీక్షలు - ఆ నిబంధన సడలింపు..!-all set for ssc public examinations from march 21 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Ssc Exams 2025 : రేపట్నుంచే తెలంగాణ పదో తరగతి పరీక్షలు - ఆ నిబంధన సడలింపు..!

TG SSC Exams 2025 : రేపట్నుంచే తెలంగాణ పదో తరగతి పరీక్షలు - ఆ నిబంధన సడలింపు..!

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 4వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తవుతాయి. మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మార్చి 21వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈసారి 5 లక్షల 9 వేల 403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా… ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నరం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలన్నీ ఏప్రిల్ 4వ తేదీతో పూర్తవుతాయి.

  • మొత్తం 2650 పరీక్షా కేంద్రాలకు 2650 చీఫ్ సూపరింటెండెంట్లు, 2650 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 28,100 ఇన్విజిలేటర్లను నియమించారు.
  • అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి పొందవచ్చు. లేదా  www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు.
  • హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో (ఫోన్ నంబర్: 040-23230942) తో పాటు అన్ని జిల్లా విద్యా కార్యాలయాలలో ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
  • గతంలో పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యం వచ్చినా అనుమతించేవారు కాదు. అయితే ఈసారి మాత్రం అభ్యర్థులను ఉదయం 09.35 గంటల వరకు (అంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్) పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
  • వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఉదయం 08.30 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి.
  • అన్ని పరీక్షా కేంద్రాలలో తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
  • పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఎగ్జామ్ జరిగే సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారు.
  • పరీక్షల పర్యవేక్షణను అరికట్టడానికి 144 ఫ్లయింగ్, స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
  • పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ప్రతి పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

పరీక్షల షెడ్యూల్ వివరాలు:

  • 21-03-2025 ఫస్ట్‌ లాంగ్వేజ్
  • 22-03-2025 సెకండ్‌ లాంగ్వేజ్
  • 24-03-2025 థర్డ్‌ లాంగ్వేజ్
  • 26-03-2025 మ్యాథమేటిక్స్‌
  • 28-03-2025 ఫిజికల్‌ సైన్స్‌
  • 29-03-2025 బయోలాజికల్‌ సైన్స్‌
  • 02-04-2025 సోషల్‌ స్టడీస్‌.
  • 03 -04- 2025 ఒకేషనల్ కోర్స్ పేపర్-1 లాంగ్వేజ్
  • 04-04 -2025 ఒకేషనల్ కోర్స్ పేపర్-2 లాంగ్వేజ్.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.